ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈఆర్సీ.. సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేలు, సెప్టెంబర్ 2026 నాటికి వేయి మెగావాట్ల మేర సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఈఆర్సీ సమ్మతి తెలిపింది.. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో త్రైపాక్షిక ఒప్పందాన్ని ఏపీ ఈఆర్సీ ఆమోదించింది… ఇక, నెట్ వర్క్ ఛార్జెసును ప్రభుత్వం నుంచి క్లైమ్ చేసుకోవాల్సిందిగా ఏపీ ఈఆర్సీ సూచించింది.