రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వేస్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సర్వీస్ను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్సీటీసీ, ఎన్పీసీఎల్, సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి. ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి.. గరిష్ట పొదుపును అందించేందుకు ఈ కార్డ్ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. అయితే కార్డు జారీ అయిన 45 రోజులలోపు వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు […]
కరోనాకు మరో టీకా అందుబాటులోకి వస్తోంది. బయోలాజికల్-ఈ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్అత్యవసర అనుమతికి డ్రగ్స్కంట్రోలర్ జనరల్ ఆఫ్ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. 12-18 ఏళ్ల పిల్లలకు రెండు డోసులుగా ఈ టీకాను వేస్తారు. 5 కోట్ల కార్బెవాక్స్ డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును 145 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనం. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. Read Also: […]
ఉత్తరప్రదేశ్లో నాలుగోదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది.. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక నాలుగో దశ ఎన్నికల్లో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ […]
ఉక్రెయిన్పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే […]
శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనుండగా.. మార్చి 4 వరకు అంటే 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇక, ఈ నెల 23 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తామని, దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఉంటుందని.. మొదటిసారి […]
హైదరాబాద్లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని నివాసంలో గౌతమ్రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్ […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది. విదేశీ ప్రయాణాలు నిరుత్సాహ పరుస్తాయి. మీరు ఇతరులతో సంభాషించడం మంచిది కాదని గమనించండి. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ కనపరుస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. దుబారా ఖర్చులు నివారించటం సాధ్యపడక పోవచ్చు. ఒక సమస్య […]
ఆంధ్రప్రదేశ్ యువ కేబినెట్ మినిస్టర్ మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం అందరికీ షాక్గా మారింది.. ఫిట్గా ఉండే గౌతమ్రెడ్డి.. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.. ఇదే, సమయంలో.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి కూడా మరోసారి తెరపైకి వచ్చింది.. ఇద్దరిదీ చిన్న వయస్సే. ఇద్దరూ గుండెపోటతోనే సడెన్గా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.. ఇద్దరికీ అనేక పోలికలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. గౌతమ్ రెడ్డి వయస్సు 50 […]
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా […]
పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. వరుసగా పెరుగుతూ.. మరోసారి షాక్ఇచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార 45వేల 900 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోలిస్తే 90 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 50వేల 50 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే 130 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా కాస్త […]