UP Polls 2022: నాల్గో దశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో నాలుగోదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది.. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక నాలుగో దశ ఎన్నికల్లో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ధారణ కావడంతో నాలుగో దశ పోరును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మరోవైపు బుధవారం జరిగే పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Read Also: Putin: ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
అధికార బీజేపీకీ, విపక్ష సమాజ్ వాదీ పార్టీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో మరో విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువస్ధానాలు గెల్చుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో ప్రియాంక గాంధీ ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకుని మహిళల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ లక్నోలో ప్రియాంక.. రోడ్షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల పాటు ఉత్తరప్రదేశ్ భవిష్యత్ నిర్ణయిస్తాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన మద్దతు ధర దక్కడంలేదని ఆరోపించారు. మరోవైపు మణిపూర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మణిపూర్ సంప్రదాయం, వాటిని కాంగ్రెస్ తప్పకుండా కాపాడుతుందని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు రాహుల్.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!