కాంగ్రెస్ పార్టీపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… 2 నెలల్లో పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా సమావేశమైన రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానంటూ ఛలోక్తులు విసిరారు. ఇక, తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. రాజ్యసభ చైర్మన్గా క్రమశిక్షణ, విలువలను, […]
సీఎం వైఎస్ జగన్పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ, […]
సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. […]
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. హన్మకొండ జిల్లాలో జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్న విజయశాంతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం అన్నారు.. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న ఆమె.. సంస్కృతి సంప్రదాయాలు కాపాడే బాధ్యత మోడీ తీసుకున్నారని తెలిపారు. Read […]
ప్రయాణాల్లో లగేజీ, విలువైన వస్తువులు మర్చిపోవడం.. కొన్నిసార్లు మారిపోవడం సర్వ సాధారణ విషయమే.. ఎంత జాగ్రత్త పడినా.. ఆ ఇబ్బందులు కొన్నిసార్లు తప్పువు.. ఇక, పోయిన లగేజీ తిరిగి పొందడం కూడా సవాల్తో కూడుకున్న విషయమే.. అయితే, మారిపోయిన తన లగేజీ కోసం ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఆ ప్రయాణికుడు… తన లగేజీ కోసం సదరు విమానయాన సంస్థను సంప్రదించాడు.. అయితే, అవతలి ప్రయాణికుడి […]
తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి.. కొమురం భీం జిల్లా కెరమెరిలో ఇవాళ అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే, ఎండ తీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయం కుదించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా […]
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటునకు ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడిన విషయం తెలిసిందే.. మరోవైపు… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి కాసేపటి కిత్రమే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్గా సమావేశమైన ఏపీ కేబినెట్.. […]
విద్యుత్ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా వడ్డింపుల పర్వానికి తెరలేపాయి.. ఇప్పటికే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా… ఓవైపు పెట్రో ధరల పెంపుతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ ట్యాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజువారి పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది.. అయితే, ఎన్నికలు ముగియడం.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. మళ్లీ క్రమంగా పైకి కదులుతూ సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయి పెట్రో ధరలు.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పెట్రో ధరల పెంపుపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. పెట్రో ధరల పెంపు అనేది ప్రధాని నరేంద్ర […]