GST: జీఎస్టీ శ్లాబ్ రేట్ల మార్పు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ప్రస్తుతం జీఎస్టీని నాలుగు శ్లాబులుగా వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. 5, 12, 18, 28 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి.. రాష్ట్రాల ఆదాయాన్ని పెంపొందించేందుకు, జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో భారీ వినియోగంతో కూడిన కొన్ని వస్తువులను 5 శాతం శ్లాబ్ నుంచి 3 శాతం పెంచి 8 శాతం శ్లాబ్ను తెచ్చే అవకాశం ఉందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. బంగారం మరియు ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు ఉంటుంది.. ఇది కాకుండా, లెవీని ఆకర్షించని అన్బ్రాండెడ్ మరియు అన్ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వస్తువుల కోసం నిపుణుల జాబితా కూడా ఉంది. వాటిని కొత్తగా ఏర్పాటు చేసే ఎనిమిది శాతం శ్లాబ్లోకి తెస్తారని వార్తలు వస్తున్నాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం..
Read Also: African Swine Fever: మరో కొత్త వైరస్.. భారత్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
మేలో జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతం శ్లాబ్ను తొలగించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ చేపట్టాలని యోచిస్తోందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మంత్రుల బృందం (జీవోఎం) ఏ భావి ఎజెండాపై చర్చించడానికి ఇంకా సమావేశం కాలేదు మరియు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనలపై నివేదికను సమర్పించినప్పుడు మాత్రమే జీఎస్టీ కౌన్సిల్ చర్చిస్తుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్కు పంపే సిఫార్సులను జీవోఎం ఖరారు చేస్తుందంటున్నారు.. కాగా, 5 శాతం శ్లాబ్లో ప్రధానంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి… గణాంకాల ప్రకారం 5 శాతం శ్లాబ్లో ప్రతి 1 శాతం పెంపుతో దాదాపుగా ఏటా రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందుతుంది. జీఎస్టీ కింద అవసరమైన వస్తువులకు మినహాయింపు లేదా తక్కువ రేటుతో పన్ను విధించబడుతుంది. అయితే, లగ్జరీ మరియు డీమెరిట్ వస్తువులు అత్యధిక పన్నును కలిగిఉన్నాయి.. లగ్జరీ మరియు సిన్ గూడ్స్ కూడా అత్యధిక 28 శాతం శ్లాబ్ పైన సెస్ను విధిస్తున్నారు.. ఈ సెస్సు వసూళ్లు జీఎస్టీ రోల్అవుట్ కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగించబడుతుందని భావిస్తున్నారు. జూలై 1, 2017న జీఎస్టీ అమలు సమయంలో, జూన్ 2022 వరకు రాష్ట్రాలకు ఐదేళ్లపాటు పరిహారం ఇవ్వాలని మరియు 2015-16 బేస్ ఇయర్ ఆదాయంపై సంవత్సరానికి 14 శాతం ఆదాయాన్ని కాపాడడానికి కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!