నష్టాల సాకు చూపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను బలి చేస్తారా అంటూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి… ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన ఆంధ్రప్రదేశ్ […]
కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక […]
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం అంశంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించినా.. ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ఇవాళ పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, ఆ అవిశ్వాన తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ […]
గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. 2016, ఆగష్టులో తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్లో హతం అయ్యాడు నయీమ్.. ఇక, నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీమ్తోపాటు అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది.. నయీమ్ బినామీ ఆస్తులను జప్తు […]
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో […]
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు […]
ఆంధ్రప్రదేశ్లో నాటుసారా స్థావరాలపై ఉక్కుపాదం మోపుతోంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)… రాష్ట్రవ్యాప్తంగా గత 16 రోజుల్లో భారీ ఎత్తున నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు చేస్తోంది.. ఆపరేషన్ పరివర్తన్-2.0లో భాగంగా నాటు సారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 3,403 నాటుసారా కేసుల నమోదు చేసిన అధికారులు, 2,066 మందిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.. ఇక, 44 వేల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 155 వాహనాలను సీజ్ చేసింది ఎస్ఈబీ.. 16 […]
సంపాదన విలువ తెలియాలంటే రూపాయి.. రూపాయి కూడబెట్టాలి అని చెబుతుంటారు పెద్దలు.. ఓ యువకుడిని చూస్తే అది నిజమేగా అనాల్సిందే.. విషయం ఏదైనా సరే.. దాని వెనుక కృషిని బట్టే ఫలితం ఉంటుంది.. ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది… అత్యంత ఖరీదైన బైక్ను మొత్తం రూ.1 నాణాలతో కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఆ యువకుడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు బైక్ కొనాలని […]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా డబ్బులు వెనుకేసిన రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఒక్కరేంటి.. చిన్ననుంచి పెద్ద వరకు ఎంతో మందిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. అయితే, కొందరు మాత్రం అడ్డంగా బుక్కైన సందర్భాలు ఉన్నాయి.. ఇక, ఎప్పుడో చేసిన తప్పులు.. ఏళ్ల తరబడి వెంటాడి నేతలు కూడా ఉన్నారు.. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక […]
విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న గటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో.. ప్రయాణికులతో ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్ను తాకింది.. స్పైస్జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను […]