కరోనా మహమ్మారికి చెక్పెట్టేందుకు క్రమంగా అన్ని ఏజ్ గ్రూప్లకు వ్యాక్సినేషన్పై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. దశలవారీగా ఇప్పటికే 12 ఏళ్లు పైబడినవారి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్పై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంమైంది.. 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చించింది.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు […]
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సిటీలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. వరుగా సిటీలను స్వాధీనం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇక, ఉక్రెయిన్ కీలక నగరాల్లో ఒకటైన మేరియుపోల్ తమ వశమైయిందని తాజాగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విజయంగా అభివర్ణించారు.. మిమ్మల్నందరినీ […]
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్లోని మజార్-ఎ-షరీఫ్లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి.. […]
గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదు.. సీఎం వైఎస్ జగన్ అందరికీ సొంతింటి కలను నెరవేరుస్తారని తెలిపారు మంత్రి జోగి రమేష్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదలకు సొంతిల్లు కట్టించాలనే సంకల్పంతో 31 లక్షల మందికి ఇళ్లు ఇస్తున్నట్టు వెల్లడించారు.. అందులో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు… సీఎం వైఎస్ జగన్ ఆలోచనా విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని.. గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. Read Also: […]
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే […]
వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన.. రేపు ఒంగోలు వెళ్లనున్నారు.. ఇక, శుక్రవారం ఒంగోలు వేదికగా.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికోసం రేపు ఉదయం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి.. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. అక్కడ జరిగే బహిరంగ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు… అనంతరం కీలక ప్రకటన చేశారు.. 131 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ కేపీఆర్ వ్యతిరేక ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా 131 మందిపై […]
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత […]
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. […]
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం.. […]