దేశంలో కరోనా కేసులు… మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా బాగా తగ్గిన పాజిటివిటీ రేటు… అనూహ్యంగా పెరుగుతోంది. ఇక, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉన్నట్లు భావిస్తోన్న… ఈ వేరియంట్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ఇన్సాకాగ్… ఎక్స్ఈ వేరియంట్పై క్లారిటీ ఇచ్చింది. BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా […]
ఉక్రెయిన్పై 70 రోజులుగా…యుద్ధం చేస్తున్న రష్యా…ఎంతో మందిని చంపేసింది. మరెందర్నో నిరాశ్రయులుగా మార్చేసింది. వేలాది ఇళ్లను నేలమట్టం చేసింది. ఇక్కడితో అగని రష్యా సైన్యం… సమాజం సిగ్గుపడే దారుణాలకు ఒడిగడుతోంది. ఎవరేమనుకుంటే…మాకేంటి అనేలా వ్యవహరిస్తోంది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా… రష్యా సైన్యం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నాయ్. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి విచారణలో వెల్లడైంది. వీటికి సంబంధించి […]
బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్కు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి… చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలన్నారు కేటీఆర్. సోమ, మంగళవారం అంటూ రాజకీయం చేయొద్దన్నారు. కేసీఆర్ లేకపోతే జన్మలో తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక […]
ఐపీఎల్లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై, బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, ఫాప్.. మొదటి ఏడు ఓవర్ల వరకూ స్కోర్ బోర్డుని బాగానే లాక్కొచ్చారు. ఒక్క వికెట్ కూడా పడకుండా, ఏడు ఓవర్లలో 62 పరుగులు చేశారు. ఆ తర్వాత ఫాఫ్, మ్యాక్స్వెల్ వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. ఆర్సీబీ స్కోర్ బోర్డ్ […]
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులో ఉన్న ఆ వైబ్రేషన్సే వేరు. కెప్టెన్గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఐపీఎల్లోనూ తన చెన్నై జట్టుని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తన కెప్టెన్సీలో ఆ జట్టుని నాలుగుసార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. ఇప్పుడు తన పేరిట మరో రికార్డ్ని లిఖించుకున్నాడు. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్గా ఉన్న ధోనీ.. బుధవారం (మే 4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరుతో సీఎస్కే తరఫున 200వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. […]
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై […]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం పెను దుమారంగా మారింది. APSRTC ని ప్రైవేట్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలో భాగంగానే అద్దె బస్సుల సంఖ్యని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అనుమానాలు రేకెత్తాయి. అయితే, తాజాగా వీటిని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయే తప్ప, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్పై నిర్ణయాన్ని వీసీకే వదిలేసింది హైకోర్టు.. రెండు రోజుల క్రితం పిటిషన్ను పరిశీలించాలంటూ వీసీని ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, వీసీ సెలవులో ఉండడంతో.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. Read Also: Konda Vishweshwar Reddy: బండితో కొండా భేటీ.. బీజేపీలో చేరతారా? కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల […]
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిశారు. మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ని విశ్వేశ్వరరెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ సమయంలో కొండా… సంజయ్ని కలవడంతో.. పార్టీలో చేరికపైనే అనే ప్రచారం జరుగుతోంది. గతంలోనూ బీజేపీ నేతలతో పలు సందర్భాల్లో సమావేశం అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో […]
రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలుసు! రాష్ట్రంలో మహిళా సంరక్షణపై ఆ ఘటన ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించింది! రైల్వే స్టేషన్లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్, అది కూడా భద్రత ఎక్కువగా ఉండే చోట్లలో ఒకటైన అలాంటి ప్రదేశంలో.. ఓ మహిళ అత్యాచారానికి గురవ్వడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. Read Also: Botsa Satyanarayana: నారా లోకేష్ లేఖకు బొత్స స్ట్రాంగ్ రియాక్షన్ ఈ నేపథ్యంలోనే […]