ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోంది.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుండగా… దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పుమంటున్నాయి.. నందమూరి ఫ్యామిలీ కూడా ఈ మార్పును తప్పుబడుతోంది.. అయితే, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు… ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, ఎన్టీఆర్ను మానసికంగా క్షోభ పెట్టారు… అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు అని విమర్శించారు […]
గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి… హౌసింగ్కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న ఆయన… ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం… ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేసిన […]
దసరా పండుగ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా వెల్లడించారు.. దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యం కోసం స్పెషల్ బస్సులను తిప్పనున్నాం.. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4500 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.. 2100 ఫ్రీ దసరా బస్సులు నడుపుతాం.. సాధారణ ఛార్జీలతోనే అదనపు బస్సులు తిప్పుతామని స్పష్టం […]
ఆ కుర్రాడి వయస్సు పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు.. సంపాదన మాత్రం వెయ్యి కోట్లు అంటే అంతా నోరు వెల్లబెట్టాల్సిందే.. అంతేకాదండోయో… రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు… అతను ఎవరో కాదు.. Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అతి చిన్న వయసులోనే.. అంటే 19 ఏళ్ల వయసులోనే.. కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా […]
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి.. Read Also: Wipro: ఆ పని చేస్తున్న […]
కరోనా ఎంట్రీతో వర్కింగ్ స్టైల్ మారిపోయింది.. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాల్సిన పరిస్థితి… అయితే, ఇదే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు… ఒకే సమయంలో రెండు కంపెనీల్లోనూ పని చేస్తున్నారట.. ఉద్యోగం చేస్తూనే.. సైడ్లో మరో కంపెనీలో… వారు పనిచేస్తున్న సంస్థకు పోటీగా ఉన్న సంస్థల్లోనూ వర్క్ చేస్తున్నారట.. అయితే.. ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు షాకిచ్చింది. మూన్లైటింగ్ విధానంలో తమ సంస్థకు చెందిన 300 మంది […]
టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని పేర్కొంది.. అయితే, అలాంటి వాటిని ఆపాల్సిన బాధ్యత టీవీ యాంకర్లదేనని స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకుడిగా ఎందుకు మిగిలిపోయింది అని ప్రశ్నించింది.. ద్వేషపూరిత ప్రసంగాలపై టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ పాత్ర చాలా ముఖ్యమైనది అని పేర్కొంది. Read Also: Chhello show: ఆ […]
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో మంత్రి విడుదల రజిని తీర్మానం ప్రవేశపెట్టడం.. ఆ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ఈ పరిణామాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వివాదాలు సృష్టించాలని […]
దేశంలో బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకి చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు భారత్కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు.. ఇక, గుజరాత్లో భారీ బ్యాంక్ స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఏకంగా రూ.22,842 కోట్ల రూపాయలను.. ఏబీజీ షిప్యార్డ్ అనే కంపెనీ మోసం చేసింది.. 28 బ్యాంకులను ముంచేసింది ఆ సంస్థ… ఉద్దేశపూర్వకంగా మోసగించిన ఈ కంపెనీ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏబీజీ షిప్యార్డు, డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామితో పాటు అశ్వినీ […]
అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. సీపీఐ శ్రేణులు పునరుత్తేజంతో పని చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో కలిశాం.. సమస్యలు ఎక్కడ ఉంటే సీపీఐ అక్కడ ఉంటుంది.. రాష్ట్రంలో అనేక వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు, పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. ఇటీవల జరిగిన […]