Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Top Headlines @5PM : టాప్ న్యూస్
నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కిర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం […] -
Challa Dharma Reddy : గృహలక్ష్మి ఇండ్లను నిర్మించిన ఏకైక నియోజకవర్గం పరకాల..
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారలను అభయ హస్తం పథకంలో ఇందిరమ్మ ఇళ్లు జాబితాలో చేర్చాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గృహలక్ష్మి పథకంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఆరు గ్యారేంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో చేర్చి బిల్లులు చెల్లించాలని కోరారు. పార్టీలకు అతీతంగా, జిల్లా కలెక్టర్లు, అధికారుల ప్రత్యక్షంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభం […] -
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సన్మానించిన ఓయూ నేతలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను రాష్ట్ర సచివాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరము పురస్కరించుకొని భట్టి విక్రమార్కతో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేతగా పాదయాత్ర చేసినటువంటి ఫోటోలను టీపీసీసీ […] -
Amara Raja Group : తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు. […] -
Madhusudhan Reddy : ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుంది
ఇంటర్ బోర్డుకు సంబంధించిన150 కోట్లు ను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను 52 కోట్లు కూడా ఇంటర్ బోర్డ్ నుండి చెల్లించాలని ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉచిత విద్యకు ఈ పది ఏళ్లలో ఖర్చు చేసింది […] -
CM Revanth Reddy : 36 నెలల్లో మూసీ నదీ పరివాహక అభివృద్ధి
మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధి పై మంగళవారం నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
సీఎస్, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి ఏపీ హైకోర్టు నోటీసులు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ […] -
Heavy Traffic : హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మెహదీపట్నం, మాసబ్ట్యాంక్, లక్డీకపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. లక్డీకపూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. బంజారాహిల్స్ రోడ్ నెం 12, రోడ్ నెం. 1లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడడంతో ఎక్కడి వాహనాలు అక్కడ చిక్కుకుపోయాయి. ఊహించని రీతిలో వాహనాలు రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఐకియా, గచ్చిబౌలి, నానాక్రామ్గూడలో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో వేల కొద్దీ […] -
CM Revanth Reddy : సీఎం రేవంత్ను కలిసిన సింగరేణి నూతన సీఎండీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై సింగరేణి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్ ఏ సి)గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.బలరామ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించగా.. తగినంత బొగ్గు రవాణాను ఎటువంటి కొరత లేకుండా కొనసాగిస్తామని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందజేస్తామని […] -
Uttam Kumar Reddy : కిషన్ రెడ్డి కాంగ్రెస్పై బురద జల్లే ప్రయత్నం చేశారు
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆయన మాట్లాడిన మాటల్లో సత్యదూరం అయినవి ఉన్నవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కలిసి 3500 రోజులు గడిపారని, పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీ అన్ని విషయాల్లో కలిసి పని చేసారన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నవని, కాళేశ్వరంకు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు […]
తాజావార్తలు
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!