Madhusudhan Reddy : ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ బోర్డుకు సంబంధించిన150 కోట్లు ను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను 52 కోట్లు కూడా ఇంటర్ బోర్డ్ నుండి చెల్లించాలని ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉచిత విద్యకు ఈ పది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 62 లక్షలు మాత్రమేనని, ప్రభుత్వం ఇంటర్ విద్య ను గాలికి వదిలేసిందన్నారు మధుసూదన్ రెడ్డి. ఇంటర్ బోర్డు ఆర్థిక పరిస్థితి దిగజారిందని, పరీక్షలో డ్యూటీ లో, స్పాట్ వల్యూవేషన్లో పాల్గొన్న వారికి రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
50 వేల మందికి రెమ్యునరేషన్ పెండింగ్ లో ఉందని, 200 మందికి అదనంగా పని చేసినందుకు 80 రోజుల వేతనం ఇవ్వలేదన్నారు. మా డబ్బులు మా ముఖాన పడేయాలని ఇంటర్ బోర్డు నీ డిమాండ్ చేస్తున్నానన్నారు. వివిధ పనుల(ఇంటర్ విద్యా కమిషనరేట్ లో నిర్మాణాలు, జూనియర్ కాలేజి లో మౌలిక వసతుల) కోసం 42 కోట్ల ను నవీన్ మిట్టల్ దారి మళ్లించారని, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి అని ఆయన అన్నారు. లావా దేవిలా పై విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధ్యాపకులకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతామన్నారు. ఇంటర్ బోర్డు ఆర్థిక స్థితిగతుల పై వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు.
తాజావార్తలు
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!