AP Update : ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ సచివాలయాలకు కొత్త పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇకపై వాటిని “విజన్ యూనిట్స్” (Vision Units)గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రులు, అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే […]
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు […]
రీటైల్ వ్యాపారంలో బ్రాండ్ ఇమేజ్ సృష్టించిన ఆర్.ఎస్.బ్రదర్స్, దక్షిణ భారతదేశంలో విస్తరణలో భాగంగా, 2025 నవంబరు 6వ తేదీన, తెలంగాణలో చరిత్ర సృష్టించిన వరంగల్ నగరంలో తమ సరికొత్త షోరూమ్ అంగరంగ వైభోగంగా శుభారంభం చేసింది. వ్యాపారరంగంలో ప్రముఖ దార్శనికులైన పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు మరియు దివంగత పి.సత్యనారాయణ గార్లు సుదూర దృష్టితో ప్రణాళికాబద్ధంగా నెలకొల్పిన ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థ – సంప్రదాయాన్ని, ఆధునిక ఫ్యాషన్లను మేళవించి భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారులకు చేరువవుతోంది. అందులో భాగంగా వరంగల్లోని సరికొత్త […]
Koti Deepotsavam 2025 Day 5: హైదరాబాద్లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, […]
కండువాలు మార్చారు. పార్టీలు మారారు. క్యాడర్ను తీసుకెళ్లారు. ఏకంగా పార్టీ ఆఫీసును కూడా లాగేసుకున్నారు. పార్టీ జెండా మార్చినంత ఈజీగా పార్టీ ఆఫీసు భవనం రంగులూ మార్చేశారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ పినపాక నియోజకవర్గంలో దండయాత్రలు, ఎదురుదాడులు, ఆక్రమణల పర్వం పీక్ లెవల్కు చేరింది. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం పేరుతో మహా రంజుగా రాజకీయం సాగుతోంది. పోటాపోటీగా నేతల చర్యలు…సూటిపోటీ మాటలు అగ్గిరాజేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే […]
హైదరాబాద్లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది.
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ, […]
Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. BRS ఉప ఎన్నికలు వచ్చాయి.. మా MLA చనిపోయారు… ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ.. […]