CM Revanth Reddy : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దతామని […]
Gulzar House : హైదరాబాద్ గుల్జార్హౌస్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న భయంకర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రాణాలను బలితీసుకుంది. ముత్యాల వ్యాపారిగా పేరుగాంచిన ప్రహ్లాద్ మోడీ కుటుంబం ఈ విషాద ఘటనలో మృత్యుపాశంలో చిక్కుకుంది. వారి కుటుంబాన్ని చుట్టుముట్టిన మంటలు, ఆనాటి నుండి నేటి వరకు సాగిన వారసత్వాన్ని ఒక్కసారిగా భస్మంగా మార్చేశాయి. Honda Rebel 500: కుర్రళ్లను అట్రాక్ట్ చేస్తోన్న బైక్.. హోండా కొత్త ప్రీమియం బైక్ రెబెల్ 500 […]
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..! హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్ను కోక్కేల ద్వారా […]
Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ […]
HYDRA : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్పల్లి నియోజకవర్గం హైదర్నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్ను అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు […]
Viral News : ఇప్పటి కాలంలో మనుషుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నదనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయకపోవడం, మృగాల కన్నా హీనంగా ప్రవర్తించడమూ సహజంగా మారిపోయిన సమాజంలో… కొందరు చిన్నారులు చూపించిన ఉదాత్త భావన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియోలో, ఇద్దరు చిన్నారులు గాయపడిన ఓ మూగజీవిపై చూపించిన ప్రేమకు అందరూ ముగ్దులవుతున్నారు. చక్రాల బండిలో గాయపడిన కుక్కను కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ అమూల్యమైన […]
Tragedy : ఉత్తరప్రదేశ్లోని జలౌన్ జిల్లాలో ఒక భయంకరమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఒక భార్య తన ప్రియుడిని కలవడానికి అడ్డుగా ఉన్న సొంత భర్తనే హతమార్చింది. పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్టు చేశారు. తన నేరాన్ని అంగీకరిస్తూ, భర్త తాగుబోతని, తనను వేధించేవాడని ఆమె పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు హంతకురాలైన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎటా కొత్వాలి ప్రాంతంలోని గిర్ధాన్ గ్రామంలో మే 13వ తేదీ […]
Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షల సంఖ్యలో యువత ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గానికి […]
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు […]
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు , సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతకుముందు, సీఎం రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి […]