Tummala Nageshwara Rao : రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి
- రాజకీయాలు కలుషితమయ్యాయి
- సమాజాన్ని మేల్కొలిపే బాధ్యత మీడియాదే
- ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం.. గోదావరి నీటితో సాగుకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు.
వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాయి. వాస్తవాలు రాయండి. సమాజం దృష్టితో వార్తలు రాయాలి. కొన్ని రాతలు బాధ పెడతాయి. అయినా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. నాటకీయంగా వ్యవహరించడం నాకు రాదు’’ అన్నారు తుమ్మల.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
తాను మద్దతిస్తున్న అభివృద్ధిలో ఖమ్మం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ఖమ్మం నంబర్ వన్ స్థానంలో ఉండాలి’’ అన్నారు. రాజమండ్రికి గంటలో చేరేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దానికి సంబంధించిన ప్రణాళికలు పూర్తవుతాయని చెప్పారు.
ఖమ్మం పరిధిలోని సాగర్ ఏరియాలో 30,000 ఎకరాల్లో సాగు పంట వేశారని, వాటికి అవసరమైన నీటిని అందించేందుకు గోదావరి నుంచి నీరు తీసుకురావడంపై కృషి చేశానని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు పాటిస్తూ ప్రాసెస్ ప్రకారం ఇవ్వనున్నట్టు తెలిపారు.
“ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అర్హులకు పథకాలు అందేలా చూస్తా” అని తుమ్మల హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చే ప్రతి వార్తపై స్పందిస్తానని, సంబంధిత అధికారులతో తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడించారు.
తాను ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని, ముఖంలోనే నిజం చెప్పే అలవాటు తనదని తుమ్మల వ్యాఖ్యానించారు. “నాకు నష్టం జరిగినా… నా పద్ధతిని మార్చుకోలేను. భగవంతుడే నన్ను ఈ విధంగా సృష్టించాడు. సమాజం ముందే నా ప్రామాణికత” అని తేల్చి చెప్పారు.
Maharashtra: అమానుషం.. మరాఠీ మాట్లాడలేదని ఆటో డ్రైవర్పై దాడి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!