Tummala Nageshwara Rao : రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి
- రాజకీయాలు కలుషితమయ్యాయి
- సమాజాన్ని మేల్కొలిపే బాధ్యత మీడియాదే
- ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం.. గోదావరి నీటితో సాగుకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు.
వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాయి. వాస్తవాలు రాయండి. సమాజం దృష్టితో వార్తలు రాయాలి. కొన్ని రాతలు బాధ పెడతాయి. అయినా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. నాటకీయంగా వ్యవహరించడం నాకు రాదు’’ అన్నారు తుమ్మల.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
తాను మద్దతిస్తున్న అభివృద్ధిలో ఖమ్మం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ఖమ్మం నంబర్ వన్ స్థానంలో ఉండాలి’’ అన్నారు. రాజమండ్రికి గంటలో చేరేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దానికి సంబంధించిన ప్రణాళికలు పూర్తవుతాయని చెప్పారు.
ఖమ్మం పరిధిలోని సాగర్ ఏరియాలో 30,000 ఎకరాల్లో సాగు పంట వేశారని, వాటికి అవసరమైన నీటిని అందించేందుకు గోదావరి నుంచి నీరు తీసుకురావడంపై కృషి చేశానని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు పాటిస్తూ ప్రాసెస్ ప్రకారం ఇవ్వనున్నట్టు తెలిపారు.
“ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అర్హులకు పథకాలు అందేలా చూస్తా” అని తుమ్మల హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చే ప్రతి వార్తపై స్పందిస్తానని, సంబంధిత అధికారులతో తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడించారు.
తాను ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని, ముఖంలోనే నిజం చెప్పే అలవాటు తనదని తుమ్మల వ్యాఖ్యానించారు. “నాకు నష్టం జరిగినా… నా పద్ధతిని మార్చుకోలేను. భగవంతుడే నన్ను ఈ విధంగా సృష్టించాడు. సమాజం ముందే నా ప్రామాణికత” అని తేల్చి చెప్పారు.
Maharashtra: అమానుషం.. మరాఠీ మాట్లాడలేదని ఆటో డ్రైవర్పై దాడి
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!