Tummala Nageshwara Rao : రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి
- రాజకీయాలు కలుషితమయ్యాయి
- సమాజాన్ని మేల్కొలిపే బాధ్యత మీడియాదే
- ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం.. గోదావరి నీటితో సాగుకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు.
వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాయి. వాస్తవాలు రాయండి. సమాజం దృష్టితో వార్తలు రాయాలి. కొన్ని రాతలు బాధ పెడతాయి. అయినా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. నాటకీయంగా వ్యవహరించడం నాకు రాదు’’ అన్నారు తుమ్మల.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
తాను మద్దతిస్తున్న అభివృద్ధిలో ఖమ్మం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ఖమ్మం నంబర్ వన్ స్థానంలో ఉండాలి’’ అన్నారు. రాజమండ్రికి గంటలో చేరేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దానికి సంబంధించిన ప్రణాళికలు పూర్తవుతాయని చెప్పారు.
ఖమ్మం పరిధిలోని సాగర్ ఏరియాలో 30,000 ఎకరాల్లో సాగు పంట వేశారని, వాటికి అవసరమైన నీటిని అందించేందుకు గోదావరి నుంచి నీరు తీసుకురావడంపై కృషి చేశానని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు పాటిస్తూ ప్రాసెస్ ప్రకారం ఇవ్వనున్నట్టు తెలిపారు.
“ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అర్హులకు పథకాలు అందేలా చూస్తా” అని తుమ్మల హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చే ప్రతి వార్తపై స్పందిస్తానని, సంబంధిత అధికారులతో తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడించారు.
తాను ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని, ముఖంలోనే నిజం చెప్పే అలవాటు తనదని తుమ్మల వ్యాఖ్యానించారు. “నాకు నష్టం జరిగినా… నా పద్ధతిని మార్చుకోలేను. భగవంతుడే నన్ను ఈ విధంగా సృష్టించాడు. సమాజం ముందే నా ప్రామాణికత” అని తేల్చి చెప్పారు.
Maharashtra: అమానుషం.. మరాఠీ మాట్లాడలేదని ఆటో డ్రైవర్పై దాడి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..