Tummala Nageshwara Rao : రాజకీయాలు చాలా కలుషితమయ్యాయి
- రాజకీయాలు కలుషితమయ్యాయి
- సమాజాన్ని మేల్కొలిపే బాధ్యత మీడియాదే
- ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం.. గోదావరి నీటితో సాగుకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు.
వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాయి. వాస్తవాలు రాయండి. సమాజం దృష్టితో వార్తలు రాయాలి. కొన్ని రాతలు బాధ పెడతాయి. అయినా నేను నిజాయితీకి కట్టుబడి ఉంటాను. నాటకీయంగా వ్యవహరించడం నాకు రాదు’’ అన్నారు తుమ్మల.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
తాను మద్దతిస్తున్న అభివృద్ధిలో ఖమ్మం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో ఖమ్మం నంబర్ వన్ స్థానంలో ఉండాలి’’ అన్నారు. రాజమండ్రికి గంటలో చేరేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోందని, సెప్టెంబర్ నాటికి దానికి సంబంధించిన ప్రణాళికలు పూర్తవుతాయని చెప్పారు.
ఖమ్మం పరిధిలోని సాగర్ ఏరియాలో 30,000 ఎకరాల్లో సాగు పంట వేశారని, వాటికి అవసరమైన నీటిని అందించేందుకు గోదావరి నుంచి నీరు తీసుకురావడంపై కృషి చేశానని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో నిబంధనలు పాటిస్తూ ప్రాసెస్ ప్రకారం ఇవ్వనున్నట్టు తెలిపారు.
“ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అర్హులకు పథకాలు అందేలా చూస్తా” అని తుమ్మల హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చే ప్రతి వార్తపై స్పందిస్తానని, సంబంధిత అధికారులతో తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడించారు.
తాను ఎప్పుడూ నిజాయితీగా ఉంటానని, ముఖంలోనే నిజం చెప్పే అలవాటు తనదని తుమ్మల వ్యాఖ్యానించారు. “నాకు నష్టం జరిగినా… నా పద్ధతిని మార్చుకోలేను. భగవంతుడే నన్ను ఈ విధంగా సృష్టించాడు. సమాజం ముందే నా ప్రామాణికత” అని తేల్చి చెప్పారు.
Maharashtra: అమానుషం.. మరాఠీ మాట్లాడలేదని ఆటో డ్రైవర్పై దాడి
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?