Mamata Banerjee: బంగ్లాదేశ్ నయా సారథి తారిఖ్ రెహమాన్కు మమతా బెనర్జీ సర్ప్రైజ్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh- Mamata Banerjee: బంగ్లాదేశ్లో తాత్కాలిక సారథి యూనస్ శకం ముగిసింది. తాజాగా జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత తారిక్ రహ్మాన్ ఘన విజయం సాధించారు. ఇప్పటికే మన దేశ ప్రధాని మోడీ తారిక్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. బంగ్లాదేశ్ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తారిక్కు గిఫ్ట్ పంపారు. ప్రత్యేకంగా పూలు, మిఠాయిలు పంపించి అభినందనలు తెలిపారు. ఈ బహుమతులను ఢాకాలోని గుల్షన్లోని పార్టీ కార్యాలయంలో బీఎన్పీ ప్రతినిధులు స్వీకరించారు. ఇదివరకే ఆమె సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రమజాన్ శుభాకాంక్షలు ముందుగానే చెప్పారు. తారిక్ రహ్మాన్ను “తారిక్ భాయ్” అని పిలుస్తూ.. పార్టీ విజయంపై ప్రత్యేక అభినందనలు చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇలాగే బలంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Mitchell Starc: భారత్ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
- Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
- IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు..
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ గురువారం ముగిసింది. అనంతరం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం 300 స్థానాల్లో 297 స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. అందులో బీఎన్పీ, దాని మిత్రపక్షాలు కలిసి 212 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించాయి. జమాత్-ఎ-ఇస్లామీ ఆధ్వర్యంలోని 11 పార్టీల కూటమి 77 స్థానాలు గెలుచుకుంది. ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ ఒక స్థానం దక్కించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టైంది. ఒకవైపు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆప్యాయ శుభాకాంక్షలు, మరోవైపు భారత ప్రధాని అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
READ MORE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ మైలేజ్.. త్వరలో Tata Punch EV లాంచ్
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : తెలంగాణలో అద్దం లాంటి రోడ్లు.. రూ.13 వేల కోట్లతో మెగా ప్లాన్
-
CM Revanth Reddy : డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు.. క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ
-
Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!