Banakacharla : రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ ఈనెల 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను ఎజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. […]
Bhatti Vikramakra : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. మా ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పెండింగ్ […]
Prosthetic Foot : దేశంలో తొలిసారిగా తక్కువ ఖర్చుతో ఉన్న అధునాతన కర్బన్ ఫైబర్ కృత్రిమ కాలుపాదాన్ని భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) మరియు ఎయిమ్స్ బీబీనగర్ సంయుక్తంగా ఈ పాదాన్ని రూపొందించారు. ఈ వినూత్న ఆవిష్కరణను మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ కాలుపాదం, దిగువస్థాయి ఆదాయ గల అమ్ప్యూటీలకు గుణాత్మక ప్రోస్తెటిక్ లభ్యతను పెంచడంతో […]
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన […]
Baba Vanga : అతీంద్రియ భవిష్య జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బల్గేరియన్ భవిష్యవక్త బాబా వంగా (Baba Vanga) మరలా వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన కొన్ని అద్భుత భవిష్యవాణులు ఇప్పటికే నిజమవ్వడం విశేషం. ఇప్పుడు ఆమె 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగే పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం, అభివృద్ధి, స్థిరత్వం లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరు నెలలు వారికి జీవితాన్ని మలుపు తిప్పేలా […]
Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Off […]
TOSS : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన SSC , ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ను సవరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ప్రెస్ నోట్లో పేర్కొనబడిన ప్రకారం, అప్లికేషన్ల సమర్పణకు సంబంధించి గడువులను పొడిగించారు. ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం, అభ్యర్థులు తమ అప్లికేషన్లను MeeSeva కేంద్రాలు లేదా అధికారిక వెబ్సైట్ www.telanganaopenschool.org ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండు దశల్లో అప్లికేషన్ సమర్పణకు అవకాశం […]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహం లేదా..? ఆ పార్టీ పెద్దలు సైతం ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? తమకు అంతో ఇంతో సంబంధం ఉన్న ఇష్యూలోకి మొత్తంగా దూరేసి ముఖ్య నేతలే పార్టీని ఇరుకున పెట్టారా? లేక వీటన్నిటికీ మించి ఇప్పటిదాకా ఎవ్వరూ అంచనా వేయలేని, పార్టీ అమెను ఓన్ చేసుకునే స్కెచ్ దాగి ఉందా? ఇంతకీ ఏంటా వివాదం? కాంగ్రెస్ తీరుపై ఎందుకు చర్చ జరుగుతోంది? తొందరపడి మన కోయిల ముందే […]
బీజేపీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం వెనక బలమైన కారణాలున్నాయా? అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏం చెప్పాలనుకుంది ఢిల్లీ నాయకత్వం? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఫైర్ బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను ఆమోదించింది పార్టీ హైకమాండ్. రిజైన్ లెటర్లో రాజా ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టింది కేంద్ర పార్టీ. అంతకు ముందు ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఎమ్మెల్యే. […]
Tragic : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన […]