ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ త్వరలోనే 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ […]
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్బాబు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్బాబు తెలిపారు. […]
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఈ రోజు దళిత బంధు ప్రారంభమైంది. మండలంలోని బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్ లను జేసీబీలను బొలెరో వాహనాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందజేశారు. అలాగే 20 మంది లబ్ధిదారులకు డైరీ కి సంబంధించి ప్రొసిడింగ్స్ ను కూడా సందర్భంగా అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ లో వైభవంగా జరిగిన దళిత బంధు వాహనాల పంపిణీలో లబ్ధిదారుల తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కూడా […]
వేసవి తాపం అప్పుడే మొదలైంది. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఎదుర్కొనే నీటి ఎద్దడిని తప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అనుకున్న దాటి కంటే వేడి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలెవ్వరూ నీటికి ఇబ్బంది పడకుండ ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో […]
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు […]
నేడు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో అని ఆయన అన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ లాంటి వ్యక్తి మన మధ్య ఉండడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి ఆయన అని, 300 కోట్ల పెట్టుబడులు తో ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారన్నారు. 90 శాతం […]
మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విప్రో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినా స్థానికులుకి ఉద్యోగాలు వస్తేనే ఉపయోగము ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. స్థానికులకు ఉద్యోగులు వచ్చేందుకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్నారు. విప్రో హైద్రాబాద్ కి రావడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. […]
నేటి సమాజంలో స్మార్ట్ఫోన్ లేని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కరోనా మహమ్మారి పుణ్యమాఅని ఇప్పుడు పిల్లల ఆన్లైన్ క్లాసులు కూడా స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. అయితే ఫోన్ కొందామనుకునే వారికి అందుబాటులో, వారి బడ్జెట్లో అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కోసం తెగ వెతుకుతుంటారు. ఈ క్రమంలో మోటోరొలా వినియోగదారుల ముందు ఓ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చందుకు అడుగులు వేస్తోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్గా మోటో జీ22ను కంపెనీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. […]
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై గతంలో ఆరోపణలు వినిపించాయి. రూ. 1034 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన అలీబాగ్లోని ఎనిమిది ల్యాండ్ పార్సెల్లను అటాచ్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని దాదర్లోని ఒక ఫ్లాట్ను తాత్కాలికంగా అటాచ్ చేసింది. పాత్ర ఛాల్ భూ […]
భారత్పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెల్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానెళ్లపై ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ను ఆదేశించింది. భారత్పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్థాన్కు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్లు […]