హైదరాబాద్ కు చెందిన మహేష్ కో ఆపరేట్ బ్యాంకు పై ఇటీవల సైబర్ నేరగాళ్లు దాడి చేసి.. రూ. 12 కోట్లకు పైగా డబ్బును 129 అకౌంట్లలోకి బదిలీ చేశారు. దీంతో మహేష్ బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ బ్యాంక్ సర్వర్ పై […]
డ్రగ్స్ కేసులో నైజిరియాకు చెందిన టోనీని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టులు టోనీకి రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు రావచ్చనే ఉద్దేశ్యంతో పోలీసులు టోనీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే టోనీ రెండో రోజు కస్టడి విచారణ లో పలు కీలక విషయాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు రాబట్టారు. టోనికి హైదరాబాదులోని […]
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసిడర్ అఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్ భూషణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ లో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ […]
మునుపెన్నడూ లేని విధంగా రోడ్డు మౌలిక సదుపాయాలను రూపాంతరం చేస్తూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు డ్రైవింగ్ పరిస్థితులను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్ట్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (SRDP) మరో అభివృద్ధి చేసిన రోడ్డును అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎస్ఆర్డీపీ కింద వివిధ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇప్పుడు LB నగర్ వద్ద అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన అండర్పాస్ను సిద్ధం […]
సోమవారం రాత్రి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మేస్రం కులస్తుల ధార్మిక, సాంస్కృతిక సంబంధమైన వార్షిక నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మేస్రం పెద్దలు మరియు పూజారుల ప్రకారం, ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి 10 గంటలకు వంశంలోని సభ్యులు మహాపూజతో ప్రారంభించనున్నారు. పాదయాత్రగా వెళ్ళితెచ్చిన పవిత్ర గంగాజలం తో నాగోబాను మేస్రం వంశీయులు అభిషేకించనున్నారు. మహాపూజతో ఈ జాతర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ జాతర […]
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. […]
ప్రేమ గుడ్డిదని పలువురు అంటుంటే విని ఉంటాం.. ప్రేమ మైకంలో తప్పని తెలిసినా కొందరు చెడు దారులు తొక్కుతూ.. వారి అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అంతేకాకుండా వారిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరాన శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటును చేసుకుంది. మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే డ్రగ్స్ కు ప్రియుడు అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి డ్రగ్స్ […]
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 5 రోజులపాటు చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న ప్రధాని మోడీ సమాధానం, కరోనా దృష్యా వేర్వేరు సమయాల్లో ఉభయ సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి […]
పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూకబ్జా, రెవెన్యూ ఉద్యోగులపై దౌర్జన్యం కేసులో పరారీలో ఉన్న వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 3 రోజులుగా దొడ్డి కిరణ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దొడ్డి […]
ఆదివారం మధ్యాహ్నం మాదాపూర్లోని టైర్ల మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగడంతో ఆస్తి దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత మోటారు విడిభాగాలు, టైర్లను ఉంచిన కారు మరమ్మతు దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. టైర్లకు సంబంధించి దుకాణం కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలోని మాదాపూర్ అగ్నిమాపక కేంద్రానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. […]