Boney Kapoor : సైబర్ ఫిషింగ్ వలలో బోనీ కపూర్.. 4 లక్షలు హాంఫట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా వారి వలలో చిక్కితే.. డబ్బులు గుల్లచేస్తున్నారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి దాదాపు రూ.4లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చిలో తన క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి దాదాపు రూ. 4 లక్షల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారని బోనీ కపూర్ అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబోలి పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బండోపంత్ బన్సోడే మాట్లాడుతూ.. తనకు తెలియకుండా తన క్రెడిట్ కార్డ్ నుండి అనేక లావాదేవీలు జరిగాయని అతను బోనీ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.
వ్రాతపూర్వక ఫిర్యాదు అందిన తరువాత, పోలీసులు ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు, కపూర్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి మొత్తం ఐదు లావాదేవీలు వివిధ మొత్తాలలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పెండింగ్లో ఉన్న క్రెడిట్ కార్డ్ బకాయిల గురించి అతని బ్యాంకు నుండి కాల్ రావడంతో అతను వివరాలు రాబట్టి పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. “మేము లావాదేవీలు జరిపిన పరికరాల యొక్క ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) చిరునామాలను అన్వేషిస్తున్నాము. ఇతర సాంకేతిక పరిశోధనలు కూడా ప్రారంభించబడ్డాయి. మేము సైబర్ విభాగం నుండి సహాయం కోరుతున్నాము” అని బన్సోడే చెప్పారు.
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ప్రతిరోజూ వందలాది మందికి పంపబడే ఫిషింగ్ ఇమెయిల్లు లేదా సందేశాలను ఉపయోగించి నిందితులు కపూర్ క్రెడిట్ కార్డ్ పిన్ను పొందారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులను వారి పిన్లు లేదా వారి నెట్బ్యాంకింగ్ లాగ్-ఇన్ క్రెడెన్షియల్ల వంటి సున్నితమైన కార్డ్ వివరాలను నమోదు చేయడానికి, బ్యాంకుల నుండి అధికారిక కమ్యూనికేషన్ల మాదిరిగానే ఇవి కనిపిస్తాయి. ఏటీఎం కియోస్క్లలో దొంగచాటుగా ఇన్స్టాల్ చేయబడిన స్కిమ్మర్లను ఉపయోగించడం ద్వారా లేదా వినియోగదారులు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేసినప్పుడు హోటళ్లు లేదా స్టోర్ల వంటి వాణిజ్య సంస్థల ఉద్యోగులు రహస్యంగా ఉపయోగించే స్కిమ్మర్లను ఉపయోగించడం ద్వారా కూడా పిన్ పొందుతున్నారని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!