మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి నేడు.. అయితే.. ఈ నేపథ్యంలో తాతాను తలుచుకుంటూ.. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనుసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..’ సదా మీ ప్రేమకు బానిసను అంటూ.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు జూ.ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో తమ అభిమాన నాయకుడు, నటుడు దేవుడిని కొలుస్తున్నారు ప్రజలు. అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ గా కూడా తారకరాముని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ కు ప్రముఖులు బారులు తీరుతున్నారు.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022