మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. […]
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలతో ఒకే చెల్లింపుతో ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక వ్యక్తికి ఆర్థికంగా చాలా కష్టంగా ఉంటుంది. ఇంటి కొనుగోలు కోసం నిధులను సమీకరించుకోవడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి హోమ్ లోన్(Home Loan). హోమ్లోన్ అనేది బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వంటి ఆర్థిక సంస్థ నుండి ఇంటిని కొనుగోలు చేసే ఏకైక ప్రయోజనం కోసం తీసుకున్న మొత్తం. మీరు హోమ్ లోన్ సహాయంతో ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారా? […]
కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. జాగరణ దీక్ష సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి, అక్రమ అరెస్టు వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న కమిటీ ఎదుట హాజరుకావాలని పోలీసులకు నోటీసులు […]
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతా సమేత జగదభిరాముడి శోభయాత్రను భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండు సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహించలేదు. అయితే రెండేళ్ల తరువాత హైదరాబాద్లో రామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది. గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో […]
ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు. ఇదిలా ఉంటే… ఇప్పటికే కొత్త మంత్రుల లిస్ట్ కూడా ఫైనలైంది. కానీ పేర్లు మాత్రం అధికారికంగా […]
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ తన మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ కూర్పు తుది దశకు చేరుకుంది. గవర్నర్కు కొత్త మంత్రుల జాబితాను నేడు పంపనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరిని కొనసాగించాలి.. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి, సీఎం జగన్ అన్ని […]
మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేశారంటున్నారు. ఈ రోజు మధ్యాహ్యం 12 గంటలకు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను కలవనున్నారు. ఈ రోజు సాయంత్రానికి తుది జాబితాను రూపొందించి రేపు ప్రమాణస్వీకారానికి రావాలని సజ్జల ప్రత్యేకంగా కొత్త మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. అయితే 10 మంది పాతవారినే కొనసాగించనున్నట్లు […]
భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. రెండేళ్ల తరువాత కరోనా అనంతరం జరుగుతున్న కల్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియంను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది.. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దేవాదాయశాఖ మంత్రి […]