Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తానే పొగిడేసుకున్నాడు. “10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశాను” అని చెప్పుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్లేనని పేర్కొన్నారు. తాజాగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం “టారిఫ్స్” అన్నారు. అలాగే.. పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనకు అస్తవ్యస్త పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. “నేను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టాను. 10 నెలల్లో […]
One Vote Victory: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మూడో విడత ఎన్నికలతో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. చివరి దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,652 మంది, వార్డు సభ్యులుగా 75,725 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Gandipet Lake: గండిపేట నగరవాసులకు తాగునీరు అందించే వరప్రదాయిని, వరదల నుంచి సిటీని కాపాడుతున్న సరస్సు అయిన గండిపేట చెరువు ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట వద్ద కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువు నీటిలోకి వదిలే ప్రయత్నం చేస్తూ దొరికారు. ఇలా ఎన్ని రోజులు నుంచి డ్రైనేజీ వాటర్ను వదులుతున్నారనే సందేహం మొదలైంది. ఇలా జరగకుండా అధికారులు స్థానికులు గమనించాలని కోరుతున్నారు.
Delhi Enforces ‘No PUC, No Fuel’ Rule as Air Pollution Turns Severe: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీని దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. గురువారం నుంచి ఢిల్లీలో "నో పియుసి, నో ఫ్యూయల్" నియమం అమల్లోకి వస్తుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అందించరు. ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రార్ అయిన…
GHMC Ward Delimitation: GHMC వార్డుల పునర్విభజన పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు రావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1,283 అభ్యంతరాలు అధికారులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ మరో రెండు పొడిగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎల్లుండి వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఒక్కో వార్డులో తక్కువ జనాభా మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని ఫిర్యాదులు…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇథియోపియా ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం "ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా"తో సత్కరించారు. తాజాగా ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం, ఇథియోపియా మధ్య సంబంధాలను ప్రశంసించారు. ఈరోజు మీ ముందు నిలబడటం తనకు లభించిన గొప్ప గౌరవమని.. సింహాల భూమి అయిన ఇథియోపియాలో నిలబడటం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.. భారత్లోని 140 కోట్ల…
Cancer Research Study: క్యాన్సర్ రోగులకు శుభవార్త అందింది. త్వరలో క్యాన్సర్ను తగ్గించే చికిత్స రాబోతోంది! ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో క్యాన్సర్ వల్ల శరీరంలో ఉండే కార్టికోస్టెరోన్ అనే హార్మోన్ లయ (రిథమ్) దెబ్బతింటుందని, ఆ లయను మళ్లీ సరిచేస్తే క్యాన్సర్ కణితులు గణనీయంగా చిన్నవయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడవచ్చని వారు భావిస్తున్నారు. శరీరంలోని బయోలాజికల్ క్లాక్ను (సర్కేడియన్ క్లాక్) లక్ష్యంగా చేసుకుని, మందులు సరైన సమయానికి ఇవ్వడం ద్వారా…
CM Chandrababu: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని వెల్లడించారు.. తాజాగా ఏర్పాటు చేసి కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక పెన్షన్లో పూర్తి సంతృప్తి ఉందన్నారు. ఇళ్ళు లేని వారికి ఇళ్లు ఇవ్వాలి.. ప్రతి వర్గంలో ప్రజల సంతృప్తి స్థాయి ముఖ్యమన్నారు. ప్రజల సంతృప్తి ఎంత ఎక్కుఉందో కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం లో రాగ ద్వేషాలు లేవు. పర్ఫార్మెన్స్ ముఖ్యమన్నారు. పాలన పై స్పష్టత ముఖ్యం.. ప్రిపరేషన్ ఉంటే మైండ్ సెట్…
CM Chandrababu Naidu: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కనియాడారు.. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు.. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని…
AP High Court: హిడ్మా ఎవరు అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. హిడ్మా, హిడ్మా భార్య రాజక్క ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్ను హిడ్మా ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. మావోయిస్టు గ్రూప్ కమాండర్ హిడ్మా అని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. హిడ్మా, ఆయన భార్యను ఎన్ కౌంటర్కు ముందే అదుపులోకి తీసుకుని మూడు రోజులు టార్చర్ చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని దీనిపై జ్యుడిషియల్ విచారణ…