Nandyal District: ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈరోజుల్లో ఓ వృద్ధ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. రామాలయానికి తమ ఆస్తిని మొత్తం విరాళంగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీర భద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు.
Anders Vistisen: డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్ల్యాండ్ విషయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్నారు. అమెరికాకు ఆ ప్రాంతం కావాలన్న ఆయన వ్యాఖ్యలు యూరప్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇదే కోపం తాజాగా యూరోపియన్ పార్లమెంట్ వేదికపై స్పష్టంగా బయటపడింది. డెన్మార్క్కు చెందిన ఎంపీ అండర్స్ విస్టిసెన్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో జరిగిన చర్చలో ట్రంప్ను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. గ్రీన్ల్యాండ్పై అమెరికా ఆసక్తి, ట్రంప్ ఒత్తిడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆయన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు. “ప్రెసిడెంట్ ట్రంప్ గారూ, జాగ్రత్తగా…
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా…
Khawaja Muhammad: పాకిస్థాన్ ప్రజా ప్రతినిధుల తెలివిలేని తనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తామే విజయం సాధించామని విర్రవీగిన పాకిస్థాన్ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పని తీరు ఎంత అజాగ్రత్తగా ఉందో ఈ ఒక్క ఘటనతోనే అర్థమవుతోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా సియాల్కోట్లో ఒక పిజ్జా హట్ స్టోర్ను ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి.. నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో…
What Is The Economic Survey: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డబ్బును ఎలా సమీకరించబోతోంది? ఆ డబ్బును ఏయే రంగాల్లో ఖర్చు చేయబోతోందన్న విషయం స్పష్టమవుతుంది. కానీ బడ్జెట్కు ముందు మరో ముఖ్యమైన పత్రం పార్లమెంట్ ముందుకు వస్తుంది. అదే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేసే ఒక నివేదిక.…
Free LPG Cylinder Scheme: ఢిల్లీ లోని పేద కుటుంబాలకు హోలీ పండుగ ముందే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఒక ఉచిత ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం తొలి దశలో రూ.300 కోట్లను కేటాయించారు. ఈ పథకం హోలీ నుంచే అమల్లోకి రానుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన…
Shinzo Abe Assassination Case Verdict Today: జపాన్ ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురి చేసిన మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో ఇప్పుడు కీలక ఘట్టం రాబోతోంది. మూడున్నరేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన ఆ కాల్పుల ఘటనపై బుధవారం జపాన్ కోర్టు తీర్పు చెప్పనుంది. దేశంలోనే ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన నాయకుడిని ఇలా బహిరంగ సభలో హత్య చేయడం జపాన్ చరిత్రలోనే అరుదైన ఘటనగా నిలిచింది. 2022 జూలైలో నారా నగరంలో ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. అబే ప్రసంగం ఇస్తుండగా..…
Oppo A6 5G: ఓపో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. పవర్ ఫుల్ బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో Oppo A6 5Gను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, వీడియోలు ఎక్కువగా చూసేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో ముఖ్యంగా ఆకట్టుకునే విషయం 7,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే చాలా సేపు ఫోన్ వాడుకోవచ్చు. అంతేకాదు.. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ సైతం ఉంది. అంటే…
Pakistan: సోషల్ మీడియాలో ఇటీవలి పాకిస్థాన్లో జరిగిన ఓ పెళ్లి తంతుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో పాకిస్థాన్కు చెందిన నటి హినా అఫ్రీదిది కావడంతో మరింతగా వేగంగా చర్చిస్తున్నారు. హినా అఫ్రీది ఇటీవల సోషల్ మీడియా పర్సనాలిటీ తైమూర్ అక్బర్ను వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు ఇప్పటికే నెట్టింట పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. అయితే ఆ అందమైన క్షణాల మధ్య ఒక చిన్న వీడియో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది.
Saina Nehwal Retirement: భారతదేశపు దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరైన సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా కాలంగా తీవ్రమైన మోకాలి సమస్యతో బాధపడుతున్నా సైనా.. ఇంకా కోలుకోలేకపోతోంది. చివరికి ఆమె ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఓ పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. తన మోకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీనివల్ల ఉన్నత స్థాయి శిక్షణ అసాధ్యమని సైనా పేర్కొంది.