Gautam Gambhir: భారత క్రికెట్లో ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ శశి థరూర్ ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను బహిరంగంగా ప్రశంసించారు. భారత ప్రధాని తర్వాత దేశంలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతేనని థరూర్ వ్యాఖ్యానించారు. రోజూ లక్షల మంది విమర్శలు ఎదుర్కొన్నా, ప్రశాంతంగా…
Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న వారికి జాగృతి మద్దతు ఇస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా మీడియాతో చీట్చాట్లో ఆమె మాట్లాడుతూ.. వారికి కామన్ సింబల్ కోసం కొన్ని జాతీయ పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్ గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందన్నారు.
Hanumantha Rao: రేణు దేశాయ్.. అమల లాంటి వాళ్ళు కుక్కలను చంపొద్దు అని అంటున్నారని.. మూగ జీవుల గురించి బాగానే మాట్లాడుతున్నారు.. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ఒకప్పుడు భర్త కోసం సతిసావిత్రి యముడితో పోరాడింది.. నేడు భర్తలను భార్య.. భార్యలను భర్తలు చంపుకునేది పెరిగిందన్నారు. ఇలా చేస్తుకుంటూపోతే పిల్లల సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై విద్యావంతులు.. మేధావులు ఆలోచించాలని సూచించారు.…
Telangana: క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…
Pending Challans: హైకోర్టు ఆర్డర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనదారులపై రెచ్చిపోతున్నారు. ఆటోలు, బైక్స్ కనబడితే ట్యాబ్లు తీసి పెండింగ్ చలాన్ల చిట్టా విప్పుతున్నారు. ఒకవైపు హై కోర్టు వాహనదారులను ఆపొద్దంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఒక్కొక్క చౌరస్తాలో పదుల సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు పహరా కాస్తున్నారు. ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే వారి వాహనాలను ఆపితే త్వరగా వసూళ్లకు అవకాశం ఉంటుందని రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఆపి ఫొటోలు…
Kavitha: ట్యాంక్ బండ్ మీద ఇంకా కూడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆంధ్రా వాళ్ళ విగ్రహాలు తీసేయాలి అనడం లేదు కానీ తెలంగాణ వారి విగ్రహాలు పెట్టాలన్నారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.
MP: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టేషన్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ చేసిన నిర్లక్ష్యం వల్ల, ఓ వ్యక్తి జీవితం గందరగోళంగా మారే పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే.. 47 ఏళ్ల పురుషుడికి చేసిన స్కాన్ రిపోర్టులో అతడికి గర్భాశయం ఉందని రిపోర్టులో రాశారు. ఆ గర్భాశయం తలకిందులుగా ఉందని పేర్కొన్నారు. తీరా చూస్తే రిపోర్టులో తప్పుగా రాశారని తేలింది. ఈ సంఘటన జరిగింది సాధారణ వ్యక్తికి…
Shah Rukh Khan: కింగ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అందరి చూపులు అతడిపైనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ అడుగుపెట్టి పెట్టగానే సోషల్ మీడియా ఊగిపోయింది. షారుఖ్ ఎంట్రీ, స్టైల్, లుక్.. అన్నీ హాట్ టాపిక్గా మారాయి. బ్లాక్ అవుట్ఫిట్లో షారుఖ్ ఖాన్ చాలా క్లాస్గా కనిపించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కసారిగా షారుఖ్ ధరించిన వాచ్పై పడింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే.. అది సాధారణ వాచ్…
Hyderabad: ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L'Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనుంది. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ –2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో లో హైదరాబాద్లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ,…
Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూల్పై ట్రాఫిక్ పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. నిత్య కృత్యంగా చేపట్టే.. పెండింగ్ చలాన్ల వసూల్పై ట్రాఫిక్ పోలీసుల డ్రైవ్ ఇంకా మొదలవ్వలేదు. ఉదయం 9 గంటలకే టాబ్స్తో ప్రధాన మార్గాల్లో వాహనదారుల పెండింగ్ చలాన్లు చెక్ చేసేవాళ్లు. నిన్న పెండింగ్ చలాన్ వసూళ్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు సందిగ్ధంలో పడ్డారు ట్రాఫిక్ సిబ్బంది.. ఉన్నతాధికారుల ఆదేశాల కొరకు వేచి చూస్తున్నారు.