-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
Donald Trump: హైదరాబాద్ నగరంలో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం తనకు అందించిన ఈ గౌరవంపై స్పందిస్తూ, ఇది ఒక "అపూర్వమైన గౌరవం" అని అభివర్ణించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో ఒక పోస్ట్ను పంచుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. "భారతదేశంలోని హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్… -
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవలంబిస్తున్న కఠిన వైఖరి.. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో ఊహించని భారీ భూకంపానికి దారితీసింది. ఈ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదికలో విరాళాల నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలడంతో ట్రస్ట్ కీలక సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. -
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
CM Yogi: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకాలతో, సనాతన ధర్మ విలువలపై ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారి పట్ల తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' (సహించేదే లేదు) విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఆలయ విరాళాల హేరఫేరి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదిక… -
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Ketan Agarwal Murder Case: పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ ఎంత తీవ్రంగా సాగుతోందో, బాధితుడు, నిందితురాలి తల్లుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతే ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఒకవైపు గోయల్ కుటుంబం తమకు ఎన్నో కీలక విషయాలు దాచిపెట్టి మోసం చేసిందని కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ఆరోపిస్తుండగా, అసలు ఆ ట్రెకింగ్కు వెళ్లడం తన కూతురికి ఇష్టమే… -
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
Yash Dayal: భారత యువ పేసర్ యశ్ దయాల్ దాదాపు ఏడాది కాలం పాటు క్రికెట్కు దూరమైన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UPT20 League) కొత్త సీజన్ ద్వారా అతను మళ్లీ బంతిని చేతపట్టనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున చివరిగా మ్యాచ్ ఆడిన ఈ 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత కొన్ని తీవ్రమైన చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుని ఆటకు దూరమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని… -
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
Hyderabad: హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్య భాయ్ అలియాస్ ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి, ప్రముఖ పోలీసు అధికారుల పేర్లు వాడుకుంటూ భారీగా డబ్బులు వసూలు చేసి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు ఒక వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ సూర్య భాయ్ సదరు వ్యాపారిని నమ్మించాడు. ఒక కంటైనర్లో కిలోల కొద్దీ బంగారం వస్తోందని, కేవలం 50 లక్షల రూపాయలకే కిలో బంగారం ఇప్పిస్తానని… -
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
Israel-Hezbollah Conflict 2026: మధ్య ప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు లెబనాన్, ముఖ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఆ దేశ దక్షిణ ప్రాంతం ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న బలమైన సాయుధ సంస్థ హిజ్బుల్లా ఇక్కడ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా బలగాల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 2026లోనూ ఇక్కడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి తమ సైన్యం వెనక్కి వెళ్లాలంటే..… -
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Hyderabad: హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్పై నిబంధనలకు విరుద్ధంగా, రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చింది. ఫ్లైఓవర్పై… -
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
Ketan Agarwal Murder Case: పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సర్వత్రా కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో పోలీసులు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల కుట్రను తెరపైకి తెస్తుండగా.. సియా తల్లిదండ్రుల స్టేట్మెంట్లు మాత్రం సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. -
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)లో వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ జవాన్ల పేర్లను తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు. ఆర్మీ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో ఈ ఆరుగురు అమరవీరుల వివరాలను చేర్చారు. వీరిలో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ ఉండగా.. భారత వైమానిక…
తాజావార్తలు
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఫౌజీ’, ‘ది ప్యారడైజ్’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!