PM Modi: బీహార్ని తక్కువ అంచనా వేయొద్దు.. ఇక్కడ తయారైన రైలు ఇంజిన్లను ఆఫ్రికాకు ఎగుమతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సిగరెట్, పొగాకు, బీడీలపై కేంద్రం నిర్ణయించిన జీఎస్టీలను విమర్శిస్తూ.. కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. బీడీ, బిహార్ ‘బి’తోనే మొదలవుతాయని పేర్కొనడంపై ఇప్పటికే బీజేపీ మండిపడింది. తాజాగా బీడీ-బీహార్ వివాదంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విమర్శలు గుప్పించారు. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థా;ఉనలు చేశారు. పూర్ణియాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఓవైపు.. బీహార్ పురోగతి సాధిస్తుంటే.. మరోవైపు రాష్ట్రాన్ని అవమానించడంలో ప్రతిపక్ష నాయకులు బిజీగా ఉన్నారని అన్నారు. బీహార్లో తయారైన రైలు ఇంజిన్లను ఆఫ్రికాకు ఎగుమతి చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. కానీ ఇది కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులకు నచ్చడం లేదన్నారు. ఆర్జేడీతో భాగస్వామ్యంతో కాంగ్రెస్, సోషల్ మీడియాలో బీహార్ను ఎగతాళి చేయడంలో బిజీగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీడీతో పోల్చడంపై మండిపడ్డారు.
READ MORE: Unbelievable: భయం మా చెడ్డది సుమీ..! కుక్కల భయానికి ఇంటిపైకెక్కిన ఎద్దు.!
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
బిహార్ లో ప్రతిపక్షాలు చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నాయని.. కానీ, తమ ప్రభుత్వం వారిని తరిమేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల పాలనాపరమైన వైఫల్యాల కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఆ పార్టీల నేతలు కేవలం తమ కుటుంబాలను మాత్రమే పట్టించుకుంటారని.. తాను మాత్రం ‘సబ్కా సాథ్.. సబ్కా విశ్వాస్’ను నమ్ముతాని మోడీ చెప్పారు. పేద ప్రజలను ఆదుకోవడమే తన ధ్యేయమన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు కోట్ల పక్కా గృహాల పంపిణీ చేపట్టామని, మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించారు.
READ MORE: Supreme Court: రోగి మరణిస్తే.. డాక్టర్ బాధ్యత వహించడు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం