Hyderabad: హైదరాబాద్లో నకిలీ మెహందీ కలకలం సృష్టించింది. మహమ్మద్ అబ్దుల్ వసీం అనే వ్యక్తి కరాచీ పేరుతో డూప్లికేట్ మెహందీ తయారు చేస్తున్నాడు. ఈ మెహందీని మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా ముస్తఫా హిల్స్లో ఉన్నా మస్రత్ మెహందీ యూనిట్పై దాడి చేశారు. మెహందీ కోన్లు, మిషన్లు అన్ని కలిపి దాదాపు రూ. అయిదు లక్షల మేర ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
NCRB Report: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసింది. 2023లో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు ఢిల్లీలో నమోదయ్యాయని NCRB నివేదిక పేర్కొంది. అయితే.. 2022తో పోలిస్తే 2023లో ఢిల్లీలో మహిళలపై నేరాలు 5.59 శాతం తగ్గాయని కూడా నివేదిక పేర్కొంది. NCRB నివేదిక ప్రకారం.. 2023లో రాజధాని ఢిల్లీలో మహిళలపై 13,000 కి పైగా నేరాలు నమోదయ్యాయి. 2022లో 14,158 కేసులు, 2021లో […]
Baba Chaitanyananda Saraswati: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. బాబా చైతన్యానంద సరస్వతికి సంబంధించి నివాసాల్లో సోదాలు జరపగా.. నేరారోపణకు సంబంధించిన సామాగ్రి దొరికింది. దర్యాప్తులో భాగంగా నేడు పోలీసు బృందం బాబాతో కలిసి ఇన్స్టిట్యూట్కు వెళ్లింది. ఆ ప్రాంగణంలో రెండవసారి సోదాలు నిర్వహించింది. పోలీసులు ఒక సెక్స్ టాయ్, ఐదు అశ్లీల వీడియో సీడీలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, UK మాజీ ప్రధాన మంత్రి డేవిడ్…
GST: సెప్టెంబర్ 2025లో GST స్థూల వసూళ్లు ₹1.89 లక్షల కోట్లకు పెరగడంతో భారత ఆర్థిక వ్యవస్థ తన బలాన్ని మరోసారి ప్రదర్శించింది. గతేడాది సెప్టెంబర్ లో ₹1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST వసూళ్లు ₹1.80 లక్షల కోట్లను దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. సెప్టెంబర్ వసూళ్లలో ఈ బలమైన పెరుగుదల ముఖ్యమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 22, 2025న అమల్లోకి వచ్చిన […]
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జాతర' చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, అభిమానులకు అసలైన పండుగ వార్త అందించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు. మాస్ మహారాజా రవితేజను వింటేజ్ రవితేజ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Uddhav Thackeray: ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్ను వీక్షించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. థాకరే ప్రకటన రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇంతలో, ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని…
Pushpaka Vimana Story: దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ దసరా వేడుకలు చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు(రేపు) శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాలకు పూజలు చేసుకొనున్నారు.
India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ "దొంగ" అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచింది. కొత్త డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.