Union Budget 2026-27: హడావుడి కాదు.. లెక్కలే కీలకం.. గత బడ్జెట్లో అంచనాలు ఫలించాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026-27: నేడు కేంద్రం 2026-2027 ఏడాదికి పద్దును ప్రవేశపెట్టనుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే పెద్ద సంస్కరణలు, కీలక విధాన నిర్ణయాలు అన్నీ ఒకే రోజున ప్రకటించే వేదికగా ఉండేది. పన్నులు, ప్రభుత్వ పథకాలకు కేటాయింపులతో పాటు దేశ దిశను మార్చే నిర్ణయాలు బడ్జెట్లోనే వినిపించేవి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు సంస్కరణలు, ఖర్చుల నిర్ణయాలు ఏడాది పొడవునా విడివిడిగా వస్తున్నాయి. బడ్జెట్ ఒక్క రోజుకే పరిమితం కావడం లేదు. అందుకే ఈసారి బడ్జెట్ను అర్థం చేసుకునే ప్రయత్నంలో హడావుడి ప్రకటనల కంటే ప్రభుత్వ ఖాతాల్లోని అసలు లెక్కలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2025–26 ఆర్థిక ఏడాదిలో సంపాదన ఎంత? ఎంత ఖర్చు చేసింది ఎంత? చివరకు లోటు ఎంత వచ్చిందన్నదే అసలు కథ.
READ MORE: KCR-SIT: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్!
Also Read
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
- Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ఎకానమిక్స్ టైమ్స్ ప్రకారం.. 2025–26లో ప్రభుత్వ ఆదాయాలపై కొన్ని ఒత్తిళ్లు స్పష్టంగా కనిపించాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. కానీ.. ప్రపంచ అనిశ్చితి కారణంగా జీతాల పెరుగుదల నెమ్మదించడం, పట్టణాల్లో ఖర్చులు తగ్గడం, జీఎస్టీ రేట్ల సర్దుబాట్లు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పడిపోవడం ఇవన్నీ పన్నుల వసూళ్లపై ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయ పన్ను, జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీల వసూళ్లు బడ్జెట్ అంచనాల కంటే సుమారు 1.9 లక్షల కోట్ల రూపాయలు తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఇదే సమయంలో జీఎస్టీ పరిహార సెస్ నుంచి 2025–26లో 1.67 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ నవంబర్ 2025 వరకు వచ్చిన మొత్తం కేవలం 0.84 లక్షల కోట్లే. మధ్యలో చాలా ఉత్పత్తులపై ఈ సెస్ను ఎత్తేయడంతో, మొత్తం ఏడాదికి సుమారు 0.92 లక్షల కోట్లే వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడే దాదాపు 0.75 లక్షల కోట్ల లోటు ఏర్పడుతోంది.
READ MORE: Cylinder Explosion: పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి, పలువురు గాయాలు!
అయితే కొంత ఊరట కూడా ఉంది. పొగాకు ఉత్పత్తులపై పన్నుల్లో మార్పులు, పాన్ మసాలా వంటి వాటిపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్లు, అలాగే ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో సుమారు 0.1 లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, పెట్రోల్, డీజిల్పై ఏప్రిల్ 2025లో పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వల్ల మరో 0.11 లక్షల కోట్ల మేర ఆదాయం రావచ్చు. ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే, 2025–26లో మొత్తం పన్ను ఆదాయంలో సుమారు 2.44 లక్షల కోట్ల లోటు ఉంటుందని అంచనా. రాష్ట్రాలకు బదిలీలు, ఎన్డీఆర్ఎఫ్కు కేటాయింపులు తీసేస్తే, కేంద్ర ప్రభుత్వానికి నికరంగా దాదాపు 1.6 లక్షల కోట్ల తక్కువ ఆదాయం వస్తుంది. అయితే జీఎస్టీ పరిహార సెస్లో వచ్చిన లోటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది రాష్ట్రాలకు జీఎస్టీ సెస్ నుంచి చెల్లించాల్సింది కేవలం రూ. 500 కోట్ల రూపాయలే. మిగతా డబ్బు అంతా గతంలో రాష్ట్రాలకు ఇచ్చిన రుణాల వడ్డీ, అసలు చెల్లింపులకు ఉపయోగించాల్సింది. ప్రారంభంలోనే జీఎస్టీ సెస్ ఫండ్లో రూ. 0.61 లక్షల కోట్ల నిల్వ ఉండగా, ఈ ఏడాది వచ్చే రూ. 0.92 లక్షల కోట్లను కలిపితే మొత్తం రూ. 1.53 లక్షల కోట్లు అవుతాయి. రుణాల చెల్లింపుల తర్వాత కూడా సుమారు రూ. 0.49 లక్షల కోట్లు మిగిలే అవకాశం ఉంది.
READ MORE: Ishan Kishan Century: ఈ సెంచరీని ప్రత్యేకంగా ఏమీ భావించట్లేదు.. నా టార్గెట్ అదే!
పన్నేతర ఆదాయాల విషయానికి వస్తే, పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది. రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు ఎక్కువగా ఉండటంతో, మొత్తం పన్నేతర ఆదాయం రూ. 6.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది బడ్జెట్ అంచనాల కంటే దాదాపు రూ. 0.49 లక్షల కోట్లు ఎక్కువ. కానీ డిజిన్వెస్ట్మెంట్ వంటి ఒకసారి మాత్రమే వచ్చే ఆదాయాలు మాత్రం అంచనాల కంటే రూ. 0.22 లక్షల కోట్లు తక్కువగా ఉండొచ్చు. ఈ అన్ని లెక్కలు కలిపితే, 2025–26లో ప్రభుత్వ మొత్తం ఆదాయం సుమారు రూ.33.6 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇది బడ్జెట్లో చెప్పినదానికంటే సుమారు రూ.1.4 లక్షల కోట్లు తక్కువ. ఇప్పుడు ఖర్చుల వైపు చూస్తే, నవంబర్ 2025 వరకు ప్రభుత్వ రెవెన్యూ ఖర్చు రూ.22.7 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. జీఎస్టీ సెస్కు తక్కువ బదిలీలు, ఆహార సబ్సిడీ, జల్ జీవన్ మిషన్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో ఖర్చు తగ్గడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కానీ పెట్టుబడి ఖర్చులు మాత్రం గట్టిగా పెరిగాయి. నవంబర్ వరకు క్యాపెక్స్ రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 28 శాతం ఎక్కువ. ఆహార పంపిణీ శాఖ, రక్షణ, రైల్వేలు, రహదారులు, టెలికాం, పోలీస్, హౌసింగ్ వంటి శాఖల్లో ముందుగానే భారీగా ఖర్చు చేశారు.
గత అనుభవాల ఆధారంగా చూస్తే, ఏడాది చివరికి రెవెన్యూ ఖర్చు బడ్జెట్ అంచనాల్లో 98 శాతం, క్యాపెక్స్ 99 శాతం వరకు చేరుతుందని అంచనా. మొత్తం ప్రభుత్వ ఖర్చు సుమారు రూ.49 లక్షల కోట్లుగా ఉండొచ్చు. ఇది బడ్జెట్ అంచనాల కంటే రూ.1.6 లక్షల కోట్లు తక్కువ. ఈ లెక్కలన్నీ కలిపితే, 2025–26లో ఆర్థిక లోటు సుమారు రూ.15.4 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇది బడ్జెట్లో చెప్పినదానికంటే 0.26 లక్షల కోట్లు తక్కువ. జీడీపీతో పోలిస్తే లోటు 4.3 శాతం మాత్రమే ఉంటుంది. ఇది బడ్జెట్ లక్ష్యమైన 4.4 శాతం కన్నా మెరుగైనది. అప్పు-జీడీపీ నిష్పత్తి దాదాపు 55 శాతంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లుగా, 2027 నుంచి అప్పు-జీడీపీ నిష్పత్తినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, 2030–31 నాటికి దాన్ని 50 శాతానికి తీసుకురావాలని చూస్తోంది. కానీ జీడీపీ వృద్ధి కొంచెం నెమ్మదించడంతో ఒక్కసారిగా పెద్ద తగ్గింపు కష్టం. అందుకే 2026–27లో 0.5 నుంచి 1 శాతం వరకు మాత్రమే తగ్గించి, లక్ష్యాన్ని 54 నుంచి 54.5 శాతం మధ్యలో పెట్టే అవకాశం ఉంది. పెట్టుబడి ఖర్చులపై ప్రభుత్వం వెనకడుగు వేయదని అంచనా. కానీ పనులు చేపట్టే సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, క్యాపెక్స్ కేటాయింపులు సుమారు 12 లక్షల కోట్ల వరకు మాత్రమే పెరగవచ్చు. మరోవైపు రెవెన్యూ ఖర్చు పెరుగుదల 5 నుంచి 6 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉంది. మొత్తానికి ప్రభుత్వం చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ మార్గంలోనే నడుస్తోంది. ఈ బడ్జెట్ కూడా ఆ జాగ్రత్త వైఖరినే ప్రతిబింబిస్తుందని అంచనా.
తాజావార్తలు
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..