Union Budget 2026: రైతుల చేతికి AI ఆయుధం.. వ్యవసాయం కోసం కొత్త పథకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో రైతులకు తీపికబురు అందించారు. ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం కేవలం పంటల వరకే పరిమితం కాదని, టెక్నాలజీతో కలిపి రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక కొత్త, ఆసక్తికరమైన పథకాన్ని ప్రకటించారు. దాని పేరు ‘భారత్ విస్తార్’. ఇది కృత్రిమ మేధస్సు(AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక డిజిటల్ సాధనం. ముఖ్యంగా ఇది అనేక భాషల్లో పనిచేయడం దీని ప్రత్యేకత. దేశంలో ఇప్పటికే ఉన్న అగ్రి-స్టాక్ పోర్టల్స్, ఐసీఏఆర్ (వ్యవసాయ పరిశోధనా సంస్థ) ఇచ్చే సాగు సూచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ టూల్ రూపొందించనున్నారు. రైతులు తమ భాషలోనే పంటలు, సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై సమాచారం పొందేలా చేయడమే దీని లక్ష్యంగా ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే, టెక్నాలజీ నేరుగా రైతు చేతిలోకి వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
READ MORE: SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
Also Read
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గ్రామీణ జీవనోపాధులపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా, ప్రాంతానికి తగిన పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆమె వివరించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి విలువైన పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న పంటలు కావడంతో రైతులకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు మద్దతు ఇస్తామని చెప్పారు. అగర్ చెట్లు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడి రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారనున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. బాదం, వాల్నట్, పైన్ నట్స్ వంటి గింజల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇవి ఖరీదైన పంటలు కావడంతో, సరైన మద్దతు లభిస్తే అక్కడి రైతుల జీవన స్థాయి గణనీయంగా మెరుగవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
READ MORE: Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
తాజావార్తలు
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!