Union Budget 2026: రైతుల చేతికి AI ఆయుధం.. వ్యవసాయం కోసం కొత్త పథకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో రైతులకు తీపికబురు అందించారు. ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం కేవలం పంటల వరకే పరిమితం కాదని, టెక్నాలజీతో కలిపి రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక కొత్త, ఆసక్తికరమైన పథకాన్ని ప్రకటించారు. దాని పేరు ‘భారత్ విస్తార్’. ఇది కృత్రిమ మేధస్సు(AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక డిజిటల్ సాధనం. ముఖ్యంగా ఇది అనేక భాషల్లో పనిచేయడం దీని ప్రత్యేకత. దేశంలో ఇప్పటికే ఉన్న అగ్రి-స్టాక్ పోర్టల్స్, ఐసీఏఆర్ (వ్యవసాయ పరిశోధనా సంస్థ) ఇచ్చే సాగు సూచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ టూల్ రూపొందించనున్నారు. రైతులు తమ భాషలోనే పంటలు, సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై సమాచారం పొందేలా చేయడమే దీని లక్ష్యంగా ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే, టెక్నాలజీ నేరుగా రైతు చేతిలోకి వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
READ MORE: SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!
Also Read
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గ్రామీణ జీవనోపాధులపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా, ప్రాంతానికి తగిన పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆమె వివరించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి విలువైన పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న పంటలు కావడంతో రైతులకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు మద్దతు ఇస్తామని చెప్పారు. అగర్ చెట్లు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడి రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారనున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. బాదం, వాల్నట్, పైన్ నట్స్ వంటి గింజల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇవి ఖరీదైన పంటలు కావడంతో, సరైన మద్దతు లభిస్తే అక్కడి రైతుల జీవన స్థాయి గణనీయంగా మెరుగవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
READ MORE: Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
తాజావార్తలు
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!