Vemulawada Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు నాసిరకం లడ్డూల అమ్మకాలు కొనసాగించడంతో పలు విమర్శలకు తావిస్తోంది. రెండు రోజుల క్రితం తయారుచేసిన లడ్డూల్లో తేమ అరకపోవడం, బూజు పట్టిన లడ్డూలనే అమ్ముతున్నారు. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత వాటి నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.. బీజేపీ అభ్యర్థిపై చర్చించారు. మూడు పేర్లను సెంట్రల్ పార్టీకు పంపించనున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, రామ చందర్ రావు, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది.. బీసీలతో రాజకీయాలు చేసిందని విమర్శించారు. […]
Hyderabad: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలైంది.. వాలిబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థినిపై కోచ్ వేధింపులకు గురి చేశాడు.. తనను ప్రేమించాలని మౌలిక అనే విద్యార్థిని కోచ్ అంబాజీ వేధించాడు. మనస్తాపానికి గురైన మౌనిక ఉరేసుకుంది. ప్రమోద్ కుమార్ హరితలకు దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మయిలు ఒక అబ్బాయి. ప్రమోద్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కాగా.. మదర్ హౌస్ వైఫ్. మృతురాలు మౌలిక రెండో సంతానం.…
Hyderabad: హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ దుండగుడు 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతులు హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు(8), కుమారుడు(7) లతో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు ఓ యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, తల్లిదండ్రులు చిన్నారి తమ్ముడిని నిలదీశారు. దీంతో ఆ బాలుడు జరిగిన…
Hydra: హైడ్రా బంజారాహిల్స్లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా కాస్తున్నాడు. ప్రభుత్వ…
Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 47 ఏళ్లలో ఎవరూ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు.. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన పీజేఆర్ ప్రజల్లో ఉంటూ గొప్ప నేతగా ఎదిగారన్నారు.. అయితే పీజేఆర్ కూడా నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పీజేఆర్’గా పేదల గుండెల్లో నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి. జనార్దన్రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారు. ఖైరతాబాద్ స్థానం నుంచి…
Hyderabad: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా.. బొల్లారంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్పై దాడి చేసి.. ఫ్లాట్ నుంచి 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కింగ్ పిన్ శివ రామకృష్ణ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబు అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన ఎం. ప్రసాద్ పరారీలో ఉన్నాడు. డ్రగ్ తయారీ కేంద్రం…
Rape Case: బీహార్లోని ఆత్మగోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించి, అదే గ్రామానికి చెందిన నిందితుడైన ఓ యువకుడు, అతని తల్లిని అరెస్టు చేశారు. ఆ బాలిక మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు.. యువకుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. నిందితుడి తల్లితో కలిసి ఆ మృతదేహాన్ని పొలంలో పడేశారు.
Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి విజేతను ఈరోజు ప్రకటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అవార్డు అందుకోవాలని తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే.. వైట్ హౌస్ ప్రచారం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో ట్రంప్ను "ది పీస్ ప్రెసిడెంట్" అని ప్రకటించింది. ఇది నోబెల్ శాంతి అవార్డు కోసం ట్రంప్ చేసిన ప్రచారంలో ఇది భాగం.
Donald Trump: నేడు ట్రంప్కు గుడ్ ఫ్రైడే అవుతుందా? బ్యాడ్ ఫ్రైడే అవుంతుందా? అని చర్చ జోరందుకొంది. నేడు నోబెల్ బహుమతి ప్రకటించనున్నారు. ది పీస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ వరిస్తుందా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శాంతి అధ్యక్షుడు అని తనకు తాను బిరుదు ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తింపు కోసం ఒత్తిడి తెస్తుండటంతో 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తీవ్ర ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. గాజా, ఇజ్రాయెల్, […]