Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం రేవంత్, డీజీపీ శివధర్రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం త్యాగస్ఫూర్తిని స్మరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.. నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. అసలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటామో ఇప్పుడు…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల […]
Hyderabad: సరోజినీ దేవి హాస్పిటల్లో బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారి సంఖ్య వరుసగా పెరుగుతోంది. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చేరారు. ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది వీరిలో ఇద్దరినీ ఇన్ పేషెంట్ గా చేర్చుకుంది. అవసరమైతే రేపు చికిత్స నిమిత్తం సర్జరీ చేసే అవకాశం ఉంటుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను కలిశారు. రోగుల సంఖ్య, వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత…
Nizamabad: నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారు జామున రియాజ్ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్ వద్ద పోలీసులు రియాజ్ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో […]
Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు..
Nara Lokesh Australia Tour: ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు.. కీలకమైన పెట్టుబడులకు గమ్య స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు లోకేష్..
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్లోని 10వ నంబర్లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన కుర్తాను చింపి, నేలపై పడుకుని, బిగ్గరగా…
Amitabh Bachchan: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్గా, డైరెక్టర్గా రిషబ్ తనదైన నేటివ్ టచ్తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే.. తాజాగా రిషబ్.. అమితాబ్ బచ్చన్ షో "కౌన్ బనేగా కరోడ్పతి"లో కనిపించాడు.
No Kings Protest in USA: అమెరికాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీ నుంచి లండన్ వరకు మొత్తం 50 నగరాల్లో ఈ భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ నిరసనకు 'నో కింగ్స్' అని పేరు పెట్టారు. ఈ నిరసన సందర్భంగా ట్రంప్ వలస, విద్య, భద్రతా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేళైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది. అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోనున్నారు. దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా భావిస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తాం. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..