Shahid Afridi: “భారత్ దెబ్బకు వణికిపోయాం”.. పాత గాయాన్ని గుర్తు చేసుకున్న పాక్ దిగ్గజం అఫ్రిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: టీమిండియా క్రికెట్లో హిస్టరీలు క్రియేట్ చేస్తోంది. తన రికార్డులు తానే బద్దలుగొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఏకంగా మూడు టీ20 వరల్డ్ కప్పులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్కు కడుపు మంట ఎక్కువైంది. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అంశంపై ఓ మీడియాలో మాట్లాడాడు. టీమిండియా గ్రాండ్ విక్టరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాత జ్ఞాపకాలు సైతం గుర్తు చేసుకున్నాడు. గతంలో పంజాబ్ రాష్ట్రం మొహాలీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టీమ్ వణికిపోయిందని తన అనుభవాలను వివరించాడు. “2011 సెమీఫైనల్ మొహాలీ స్టేడియంలో జరిగింది. మేము ఛేజింగ్ను చాలా బాగా మొదలుపెట్టాం. మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వికెట్ పడకుండా 90 పరుగులు చేశారు. కెప్టెన్గా నేను చాలా రిలాక్స్గా కూర్చు్న్నా. ఈసారి కచ్చితంగా గెలుస్తామనుకున్నా. కానీ, మొదటి వికెట్ పడగానే పరిస్థితి తలకిందులైంది. అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకుల కేకలు, ఆ ఉత్సాహం టీమ్ ఇండియాలో కొత్త ఊపిరి పోశాయి. దీంతో మా టీమ్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. స్టేడియంలో ఆ శబ్దానికి, భారత జట్టు పోరాట పటిమకు నా జట్టులోని కొందరు బ్యాటర్లు క్రీజులో వణికిపోయారు. ప్రతి బంతికి వారు ఇబ్బంది పడ్డారు. ఆ హోరులో మా జట్టు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.” అని నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.
READ MORE: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
Also Read
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ఇక 2011 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా మొహాలీలో జరిగిన భారత్-పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్థాన్పై 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 85 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో సచిన్కు నాలుగు సార్లు లైఫ్ వచ్చింది. పాక్ ఫీల్డర్లు ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఈ ఫీల్డింగ్ చూస్తే అర్థమవుతోంది. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు.. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌట్ అయింది.
READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
తాజావార్తలు
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!