Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IND vs ENG: వన్డేలకు వేళాయే.. నాగ్పూర్ వేదికగా మొదటి మ్యాచ్
IND vs ENG: మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు […] -
Telangana Congress: నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..
Telangana Congress: హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో […] -
South Coastal Zone: విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో కొత్త జోన్ ఏర్పాటు
South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్ను విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, […] -
Minister Anitha: హెట్రో పరిశ్రమ ఘటనపై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తాం
Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హెట్రో పరిశ్రమలో సోడియం హైపోక్లోరైట్ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురు బాధితులను మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తరలించామని హోంమంత్రి తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాధితులకు ఎటువంటి అనారోగ్య […] -
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారా..?
YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో […] -
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన […] -
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ […] -
Robbery: గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై చోరీ.. (వీడియో)
Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్లో రూ. 30 వేల నగదు […] -
Rashid Khan: సరికొత్త రికార్డు.. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అఫ్ఘానిస్థాన్ ప్లేయర్
Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే, […] -
AP GOs: ఆంధ్రప్రదేశ్లో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.) తెలుగు భాషలో కూడా
AP GOs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్కు సంబంధించిన జిఓ ను తెలుగు భాషలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల కోసం కీలకమైన చర్యగా భావిస్తున్నారు. […]
తాజావార్తలు
-
Theaters: తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు..
-
Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?
-
Kolkata: కోల్కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ‘SVC63’లో పవర్ఫుల్ విలన్..
-
Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!