CSK vs PBKS: చాహల్ హ్యాట్రిక్.. చెన్నై భారీ స్కోర్కు బ్రేక్
- సామ్ కరన్ 47 బంతుల్లో 88 పరుగుల అద్భుత ఇన్నింగ్స్
- యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ మాయాజాలం
- 18 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన చెన్నై.
- హ్యాట్రిక్ తో పాటు ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs PBKS: నేడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ఇన్నింగ్స్ను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ముగించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలింగ్ ఎంచుకోగా, CSK మిక్స్డ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో షైక్ రషీద్ (11), అయుష్ మ్హాత్రే (7) తొందరగా అవుట్ కావడంతో CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన సామ్ కరన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 88 పరుగులు చేసి సెంచరీ దగ్గర్లో వెనుతిరిగాడు కరన్. ఇక ఆ తర్వాత మిద్దెల ఆర్డర్ లో బ్రెవిస్ (32), జడేజా (17), ధోనీ (11) ఆడినా పెద్దగా నిలవలేకపోయారు. చివర్లో వికెట్లు వరుసగా పడిపోవడంతో 20 ఓవర్లు పూర్తి కాకముందే 19.2 ఓవర్లలో CSK ఆలౌటైంది. ముఖ్యంగా ధోనీ 275 స్ట్రైక్రేట్తో కేవలం 4 బంతుల్లో 11 పరుగులు చేసి అభిమానులను కొద్దిసేపు ఉత్సాహపరిచాడు.
Read Also: IBM: హీరోగా మారుతున్న మరో చైల్డ్ ఆర్టిస్ట్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక బౌలింగ్ విభాగంలో పంజాబ్ కింగ్స్కి యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు. ఇనింగ్స్ 19 ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లు తీసి చెన్నై స్పీడ్ కు బ్రేకులు వేసాడు. 19 ఓవర్ మొదటి బంతికి ధోని సిక్స్ కొట్టి అలరించగా, ఆ తరవాత బంతికే ధోని లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఓవర్ 3వ బంతికి దీపక్ హుడా 2 పరుగులు సాధించగా.. ఆ తర్వాత బంతికి దీపక్ కూడా వెనుతిరిగాడు. ఆ తర్వాత 5వ బంతికి కంబోజ్, 6వ బంతికి నూర్ అహ్మద్ ను అవుట్ చేసి ఈ సీజన్ లో మొదటి హ్యాట్రిక్ ను సాధించాడు. చాహల్ మొత్తంగా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసాడు. అలాగే అర్షదీప్ సింగ్, మార్కో జాన్సెన్ ఒక్కొక్కరు 2 వికెట్లు తీయగా.. ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీసారు. చివర్లో చెన్నై వికెట్లు త్వరగా కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. చూడాలిమరి పంజాబ్ టార్గెట్ ను ఏ విధంగా ఛేదిస్తుందో.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!