Ramesh Nalam
Author- NTV Telugu-
ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు… భయాందోళనలో ప్రయాణికులు
విశాఖ నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. లోపాన్ని గమనించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. ఎస్-6 బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయని ప్రయాణికులు వాపోయారు. అయితే ట్రైన్ బ్రేకులు జామ్ కావడంతోనే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది వివరించారు. లోపాన్ని సరిచేస్తున్నామని వారు తెలిపారు. కాగా గంటకు […] -
నేడు రెండో వన్డే.. గెలుపు కోసం టీమిండియా ఆరాటం
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. పార్ల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. రెండో వన్డేలో అయినా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించినా మిగతా వారు ఘోరంగా విఫలం కావడంతో టీమిండియా ఓటమి పాలు కాక తప్పలేదు. […] -
జనవరి 21, శుక్రవారం దినఫలాలు
మేషం: ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంతానంతో, వర్కర్లతో చికాకులు తప్పవు. వృషభం: ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. రుణంలో కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభాదయకంగా ఉంటుంది. విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. […] -
మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్షుగర్ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్ […] -
టీ20 ప్రపంచకప్-2022 షెడ్యూల్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. రెండు గ్రూపులుగా సూపర్-12 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రస్తుతానికి గ్రూప్-1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్… గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. మిగతా జట్లు క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడి సూపర్-12లోకి రంగప్రవేశం చేస్తాయి. Read Also: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ అక్టోబర్ 23న హై ఓల్టేజ్ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం… 32 అంశాలతో కూడిన అజెండాపై కీలకంగా చర్చించనున్న కేబినెట్★ నేడు విశాఖ రానున్న కేంద్ర చమురు శాఖ సహాయమంత్రి రామేశ్వర్… ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రామేశ్వర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం… ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై ఐక్యంగా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయంనేడు […] -
నీట్లో ఓబీసీ రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్ […] -
వీడియో: సీఎం జగన్పై పాట పాడుతూ నిరసన తెలిపిన ప్రభుత్వ ఉద్యోగులు
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టారు. పలు చోట్ల పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నారు. మరోవైపు పీఆర్సీ జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై పాట పాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల […] -
సినిమా వాళ్లకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. డ్రగ్స్ వాడుతూ దొరికితే బొక్కలో వేస్తాం
డ్రగ్స్ వాడేవాళ్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం అనేది ఇంటింటి సమస్యగా మారిందని.. ఇకపై డ్రగ్స్ వాడేవాళ్లను కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇకపై సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకునే వారిని అరెస్ట్ చేయకపోతే దీన్ని కట్టడి చేయలేమని సీపీ అభిప్రాయపడ్డారు. Read Also: తెలంగాణలో మరో భారీ […] -
రిపబ్లిక్ డే సందర్భంగా ‘హ్యాపీ’ ఆఫర్లు
తెలుగు రాష్ట్రాలలో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ‘హ్యాపీ మొబైల్స్’ సంస్థ శుభవార్త అందించింది. రిపబ్లిక్ డే సందర్భంగా మూడు రోజుల పాటు ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా షావోమీ భాగస్వామ్యంతో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసినట్లు హ్యాపీ సంస్థ తెలిపింది. ప్రో గ్రేడ్ 108 మెగాపిక్సల్ కెమెరా, అత్యద్భుతమైన 6.67 అంగుళాల ఎఫ్హెచ్డీ + 120 హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, సౌండ్ బై హర్మాన్ కార్డన్తో డ్యూయల్ స్పీకర్లు ఈ […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?