Rajesh Veeramalla
Author- NTV Telugu-
Mumbai: 30 ఏళ్ల క్రితం మర్డర్.. మందు ఎక్కువై దొరికేశాడు..!
తాగితే మనసులోని నిజాలు బయటకు కక్కేస్తారంటే ఇదేనేమో.. లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకెళ్లాడు. అవినాష్ పరారీలో ఉండి 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు. ఏదైతే నిజం చెప్పకూడనది ఉందో.. ఆ నిజాన్ని ఓ ఫంక్షన్లో ఫుల్ గా తాగి ఆ మర్డర్ గురించి బయటకక్కేశాడు. -
International Yoga Day: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. న్యూయార్క్లో వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు. -
Wrestlers Protest: సాక్షి మాలిక్ వీడియో స్టేట్ మెంట్.. కారణమవే..!
గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్మెంట్ను మార్చుకున్నట్లు పేర్కొంది. -
GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!
జూలై 11వ తేదీన ఢిల్లీలో జీఎస్టీ 50వ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది. ఈసారి ఆన్ లైన్ గేమింగ్ పై ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినో హార్స్ రేస్లపై ట్యాక్స్కు ఆమోద ముద్ర వేయనుంది. -
Morphing Photos: నిశ్చితార్థం చెడగొట్టేందుకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫోటోలు పంపిన మహిళ
కోడలు నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు తనకు కాబోయే భర్తకు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపింది ఓ మహిళ. అంతేకాకుండా తన మాజీ ప్రేమికుడి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అనంతరం వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
Parris: పారిస్ లో కలిసిన ఇద్దరు అత్యంత ధనవంతులు.. ఎవరా వాళ్లు..!
ప్రపంచలోనే అత్యంత ధనవంతులు వారిద్దరూ.. నంబర్ వన్ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతుంటుంది. వారిద్దరి సంపాదనలో స్వల్ప తేడా.. భారీ పోటీ ఉంటుంది. ఇంతకీ వారు ఎవరనుకుంటున్నారా..? ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు. -
Viral News: ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో.. స్కూటీపై మూడో అంతస్తుకు..!
సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. -
Money Missing: ప్రింట్ అయ్యాయి కానీ.. ఆర్బీఐకి చేరలేదు.. రూ.88వేల కోట్లు మిస్సింగ్.. !
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88వేలకు పైగా కోట్లు గల్లంతయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ నుంచి అక్షరాల రూ.88,032.5 మిస్ అయ్యాయి. అవన్నీ కూడా రూ. 500 నోట్లే. ప్రింట్ అయ్యాయి.. కానీ ఆర్బీఐకి చేరలేదు. అసలేమయ్యాయి. అయితే మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాల ద్వారా ఈ విషయం బయటపడింది. -
Fake Certificates: పెళ్లికి ఒప్పుకోని యువతి.. నకిలీ వివాహ ధృవీకరణ పత్రాలతో వేధింపులు..!
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళను వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో.. యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసారు. -
Kathua Case: కథువా అత్యాచారం-హత్య కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ..
కతువాలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల బాలిక 10 జనవరి 2018న తప్పిపోయింది. వారం తర్వాత ఆ బాలిక అడవిలో శవమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ జరిగింది. పంజాబ్లోని పఠాన్కోట్లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈరోజు(శనివారం) తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్లో, శుభమ్ సంగ్రాను జువైనల్గా కాకుండా పెద్దవాడుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!