నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రపంచకప్కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తన దేశానికి తిరిగి వెళ్లాడు. మీడియా కథనాల ప్రకారం.. కుటుంబ కారణాల వల్ల బావుమా ఇంటికి తిరిగి వెళ్లాడని పేర్కొన్నాయి.
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లు ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుండి పూర్తిగా కోలుకోలేక మొత్తం టోర్నమెంట్కు దూరమయ్యాడు ఆల్ రౌండర్ అష్టన్ అగర్.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
యూపీలోని గోరఖ్పూర్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఇద్దరు సోదరులతో సహా తనపై దాడి చేశారని.. ప్రాణహాని ఉందని ఓ లెక్చరర్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆసియా క్రీడలు 2023 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో స్మృతి మంధాన బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.
ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్లో పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నంబర్-1 పురుషుల టెన్నిస్ జంట రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీలు మొదటి రౌండ్లోనే ఓటమి పాలయ్యారు.
గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.