Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ పనులు ముమ్మరం చేసింది. ఈ సదుపాయాన్ని ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also: China Bat Woman: కరోనా లాంటి మరో ప్రాణాంతక మహమ్మారి.. చైనా బ్యాట్ ఉమన్ హెచ్చరిక
Also Read
తొలిదశలో బస్సుల్లో దీన్ని అమలు చేసిన తర్వాత ఆటోలు, ట్యాక్సీలు వంటి ఇతర ప్రజా రవాణా మార్గాల్లో కూడా దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బస్సు కండక్టర్కు ఇచ్చిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ (ఈటీఎం) నుంచి కార్డును స్వైప్ చేయడం ద్వారా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డ్ అన్ని మెట్రో స్టేషన్లు, ISBT, ఢిల్లీ టూరిజం కార్పొరేషన్ సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది. NCMC నుండి ఛార్జీల చెల్లింపు కోసం DTC, క్లస్టర్ బస్సులలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్లు(ఈటీఎం)లను అమర్చాలని రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Minister RK Roja: బాలయ్యకు రోజా కౌంటర్.. తొడగొట్టాడు.. తోక ముడిచాడు..!
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో సగటున రోజుకు 40 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇందులో దాదాపు 35 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. రోజుకు 25 లక్షల మందికి పైగా డబ్బులు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఇప్పుడు బస్సుల్లో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల రాజధానిలో మెట్రో, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యేక టిక్కెట్లు పొందవలసిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!