ఇటలీలో పడిపోతున్న జనాభాపూ పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటాలియన్లు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని కోరారు. దేశ జనాభా సంక్షోభం భవిష్యత్తుకు ముప్పు అని ఆయన హెచ్చరించారు. కుటుంబాలకు సహాయం చేయడానికి దీర్ఘకాలిక విధానాలకు పోప్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పిల్లలు, యువత లేని దేశానికి భవిష్యత్తు లేదన్నారు. ఇటలీలో జననాల రేటు ఇప్పటికే చాలా తక్కువగా ఉందని.. 15 సంవత్సరాలుగా నిరంతరం పడిపోతోందని పేర్కొన్నారు. గతేడాది కనిష్ట స్థాయికి చేరుకుందని…
కేఎల్ రాహుల్పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్కు షమీ మద్దతుగా నిలిచాడు.
విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్లో భారత్ తరుఫున ఇదే ఫామ్ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ జై షా అభిప్రాయపడ్డారు.
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గా కొనసాగనున్నారా బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా వన్డే ప్రపంచకప్…
అత్యంత పురాతనమైన లండన్ సెయింట్ జాన్స్వుడ్ లోని లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానుంది. టావెర్న్&ఆలన్స్ స్టాండ్లను అభివృద్ధి చేయడానికి 61.8 మిలియన్ల ప్రాజెక్ట్లో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సామర్థ్యం 1,100 పెంచనున్నారు. ప్రస్తుతం లార్డ్స్లో 31,180 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ గ్రౌండ్ సీటింగ్ సామర్ధ్యాన్ని మరో 1100 సీట్లకు పెంచేందుకు మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు చెందిన 18000 మంది ఆమోదించారు. 61.8 మిలియన్ పౌండ్ల ప్రాజెక్టులో భాగంగా.. 1930లో నిర్మించిన టావెర్న్&ఆలెన్స్ స్టాండ్స్ను అభివృద్ధి చేయనున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
బీహార్లోని ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరుకులెత్తుస్తున్నారు. మండలంలోని చందాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మొండితోక జగన్ మోహన్ రావుకు బ్రహ్మరథం పట్టారు. వాహనం పై ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను మరల గెలిపించండి అంటూ మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.