Rajesh Veeramalla
Author- NTV Telugu-
Arthritis: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. ఈ రెమెడీస్తో నయం చేసుకోండి..!
వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. -
Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. డిస్కస్ త్రో F56లో రజతం
పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది. -
Jammu Kashmir: వైష్ణో దేవి మార్గ్లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి.. శిథిలాల కింద మరికొందరు..!
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
Bihar: బీహార్లో కాల్పుల కలకలం.. బీజేపీ నేత సహా ఇద్దరు హత్య
బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు. -
Sachin Tendulkar: మీరు మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.. ప్రీతి, నిషాద్లకు సచిన్ అభినందనలు
పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్కు హైజంప్లో ఒక పతకం, స్ప్రింట్లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు. -
Yuvraj Singh Father: నా కొడుకు కెరీర్ను నాశనం చేశాడు.. ధోనీపై తీవ్ర ఆరోపణలు
టీమిండియా మాజీ కెప్టె్న్ ఎంఎస్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఆరోపణలు గుప్పించారు. తన కొడుకు కెరీర్ను ధోనీనే నాశనం చేశాడంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో కూడా పలుమార్లు ధోనీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు. ధోని తన కొడుకు కెరీర్ను నాశనం చేశాడని తెలిపాడు. క్యాన్సర్తో పోరాడి భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడని.. యువరాజ్కు భారతరత్న ఇవ్వాలని యోగరాజ్ కోరాడు. కాగా.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే… -
Krishna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా.. అధికారులు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. కృష్ణా నది వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. -
Kolkata Rape Case: కోల్కతాలో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్లో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖలు నిరసనల్లో పాల్గొన్నారు. సినీ దర్శకురాలు అపర్ణా సేన్తో సహా బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం వేలాది మంది ప్రజలతో కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి చేపడుతుంది. -
Harish Shankar: ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వందనం’ అంటూ.. హైడ్రాపై డైరెక్టర్ ఏమన్నారంటే..?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన 'హైడ్రా'పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. హైడ్రా కూల్చివేతలపై నాగబాబు'X'లో స్పందించారు. -
Lucknow: హాస్టల్ గదిలో ఐజీ కుమార్తె అనుమానాస్పద మృతి..
యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది.
తాజావార్తలు
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?