NTV WebDesk
Author- NTV Telugu-
ఏపీలో మళ్లీ ప్రమాణాల లోల్లి… ప్రమాణానికి సిద్దమైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే…
గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్మహ్మానాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీపై ఆరోపణలు చేశారు. జీవీ స్వచ్చంధ సంస్థకు ఎన్నారై నిధులు వస్తున్నాయని ఆరోపించారు. దీనిపై జీవీ ఘాటుగా స్ఫందించారు. తన సంస్థకు ఎలాంటి ఎన్నారై నిధులు రావడంలేదని తాను కొటప్పకొండలో ప్రమాణం చేస్తానని అన్నారు. జీవీ ప్రమాణంపై పోలీసులు స్పందించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరూ కూడా బయటకు వెళ్లేందుకు వీలులేదని జీవీకి […] -
కొత్త సమస్యలను సృష్టిస్తున్న కరోనా…
కరోనా మహమ్మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా సోకిన వారి కంటే, ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి నిద్రకు దూరమైన వ్యక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు కూడా సామాజికంగా దూరాన్ని పాటించాల్సి రావడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత […] -
భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు ఎలాంటి భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో కార్యకలాపాలు సాగించినా, అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కోన్నారు. భారత్లో స్వేచ్చాయుత […] -
ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటీషన్…30 ఏళ్లుగా…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనందయ్య పిటీషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్గా ఉన్నానని, ఆనందయ్య తన పిటీషన్లో పేర్కొన్నారు. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ 19 కి చేస్తున్నామని, మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, నెల్లూరు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆయుష్ కమీషనర్లను చేర్చారు. ఈ కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనందయ్య […] -
హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతున్న చర్చలు…పూర్తి నివేదిక ఇస్తేనే…
హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టిటిడీ ఇప్పటికే పేర్కోన్నది. దానకి సంబందించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలలో పలు తప్పులు ఉన్నాయని హనుమాన్ తీర్ధక్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు తిరుపతిలోని సంస్కృత విధ్యాపీఠంలో టీటీడి పండితులకు, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీకి మద్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టిటిడీ […] -
కరోనాకు పులివెందులలో ఆకు పసరు…సోషల్ మీడియాలో వైరల్…
కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం […] -
వైరల్: దాహం తీర్చుకునేందుకు వచ్చి… మొసలి నోటికి చిక్కి…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు […] -
ఆనందయ్య మందుపై సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు… అక్కడ అక్రమంగా తయారు చేస్తున్నారు…
ఆనందయ్య మెడిసిన్పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో సీవీఆర్ ఫౌండేషన్ బిల్టింగ్లో అనధికారికంగా వేల మందికి మందు తయారు చేస్తున్నారని, ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని ఆయుష్ కమీషనర్, స్టేట్ హెల్త్ ప్రకటించినా ఎందుకు మందును పంపిణీ చేయడంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలనే ఇలా చేస్తున్నారని, అదే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఇన్ని రోజులు అక్రమంగా ఆయన్ను నిర్భందించేవారా […] -
కరోనాపై జో బైడెన్ కీలక ఆదేశాలు… మూడు నెలల్లో తేల్చాలి…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్లో చైనాలో మొదటగా ఈ వైరస్ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం […] -
వేగంగా వ్యాప్తి చెందుతున్న బి.1.617…ఆ దేశంలో లాక్డౌన్ అమలు…
కరోనా మహమ్మారి వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలుగా మార్పులు చెందుతోంది. అందులో ఒకటి బి.1.617 వేరియంట్. ఇది ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇండియాతో పాటుగా ప్రపంచంలోని దాదాపుగా 60 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరగడానికి కూడా ఇదోక కారణం అని చెప్పొచ్చు. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి. విక్టోరియా రాష్ట్రంలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో […]
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?