రష్యాలోని కజన్ నగరంలో ఓ స్కూల్లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది విద్యార్ధులు మృతి చెందారు. మరి కొందరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లోపల తుపాకుల శబ్డం వినిపిస్తుండగా ఇద్దరు విద్యార్ధులు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడం ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ ఘటనకు కారణమైన 19 […]
భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్లో కరోనా కేసులు పేరుగుదలపై అమెరికన్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తప్పుడు లెక్కలే కారణమని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు. వైరస్ ను కట్టడి చేశామనే తొందరపాటులో సాధారణ జీవనానికి వెళ్లిపోయారని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయని డాక్టర్ ఫౌసీ పేర్కోన్నారు. ప్రపంచంలో ఇలాంటి […]
ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు ప్రయాణానికి అనుమతి ఉన్నది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరిని బయటకు అనుమతించడం లేదు. బస్టాండ్లు బోసిపోయి దర్శనం ఇస్తున్నాయి. చాలా మందికి లాక్డౌన్కు సంబందించి నిబందనలు తెలియకపోడటంతో బస్టాండ్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు బస్సలు లేకపోడంతో ఇబ్బందును పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల […]
ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది. ఇందులో 1,93,82,642 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,099 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4205 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం […]
చాలా కాలం తరువాత మళ్లీ ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మద్య ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. పాలస్తీనాలోని గాజాపట్టీ ప్రాంతం నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై రాకెట్ దాడులు చేశారు. పదుల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చాయి. ఈ దాడిలో ఇజ్రాయిల్లోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. దీనికి ప్రతీకగా ఇజ్రాయిల్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఈ దాడిలో 24 మంది వరకు మరణించి ఉంటారని ఇజ్రాయిల్ తెలియజేసింది. దీంతో రెండు […]
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కేసులు మూడున్నర లక్షలు ఉంటే, కోలుకున్న రోగుల సంఖ్య కూడా మూడున్నర లక్షలకు పైగా ఉంటోంది. అయితే, ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతున్నది. మొదట ఈ కేసులు గుజరాట్, మహారాష్ట్ర, ఢిల్లి తదితర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. కాగా, ఇప్పుడు ఈ కేసులు యూపీలో కూడా బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ […]
తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ అమలు జరగబోతున్న సంగతి తెలిసిందే. 10 రోజులపాటు లాక్డౌన్ అమలులో ఉండబోతున్నది. రేపటి నుంచి లాక్డౌన్ కావడంతో మద్యం షాపుల వద్ద లిక్కర్ కోసం మందుబాబులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఒక్కసారిగా మందుబాబులు షాపుల వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. కరోనా నిబందనలు గాలికోదిలేశారు. భౌతికదూరం పాటించడంలేదు. ఎక్కడ మద్యం దొరకదో అని చెప్పి ఒక్కక్కరు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉదయం 6గంటల నుంచి 10 గంటల […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరూ బయటకు రాకూడదు. లాక్డౌన్ మినహాయింపులు ఉన్న అత్యవసర సర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఉంటాయి. ఇక, వేటికి పూర్తి స్థాయిలో మినహాయింపులు […]
కరోనా కేసులపై ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య విభాగం ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం మొదటి డోస్ తీసుకున్న వారిలో కరోనాను నిలువరించే శక్తి 80శాతం పెరిగిందని, ఫలితంగా మొదటి డోస్ తీసుకున్నాక 80శాతం మేర కేసులు తగ్గాయని ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న అనంతరం 80శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. రెండో డోసులు తీసుకున్నాక 97 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. ఇంగ్లాండ్ లో వ్యాక్సిన్ తీసుకున్నాక 80 ఏళ్లకు పైబడిన వృద్దులు ఆసుపత్రుల్లో […]