కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా […]
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వ్యక్తులకు సంబందించిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దీంతో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు రూపోందిస్తున్నాయి. టాటా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి ఈ వ్యక్తి రిటైర్ అయ్యే వరకూ జీతం అందిస్తామని పేర్కొంది. దీంతో పాటుగా కుటుంబలోని పిల్లల చదువుకు సంబందించిన బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపింది. ఈ బాటలో ఇప్పుడు […]
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జులై నెలలో పరీక్షల నిర్వాహణపై సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వం తరపు వాదనలు విన్న తరువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది. మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా కరోనా విజృంభిస్తుండటంతో వాయిదా వేశారు. […]
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లతో పాటుగా విదేశీ వ్యాక్సిన్లకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చే ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫైజర్, మోడెర్నా టీకాలు కూడా ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ టీకాలు నష్టపరిహారంపై రక్షణ కోరుతున్నాయి. ఇలాంటి రక్షణ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడంతో సీరం సంస్థకూడా తమకు ఇలాంటి రక్షణ ఇవ్వాలని కోరుతున్నది. టీకా తీసుకున్న వ్యక్తి దుష్ప్రభావాలకు గురైనపుడు టీకా సంస్థలు నష్టపరిహారం […]
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ పై ఉన్న అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే వికటించి మరణిస్తారని అపోహలతో ముందుకు రావడంలేదు. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండటంతో ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ కలెక్టర్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. టీకాలు తీసుకున్న వారికే జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ […]
ఇల్లులేని పేదలకోసం రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో సుమారు 15 లక్షలకు పైగా గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తులను కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న కాలనీల నిర్మాణం పనులను సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన గృహనిర్మాణ పనులను పూర్తిచేస్తామని, రాష్ట్రజనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇంటిని ఇస్తున్నామని సీఎం […]
చిత్తూరు జిల్లాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 135 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్ లో 70 కేసులను నిర్ధారించారు. ఇక బ్లాక్ ఫంగస్తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. బ్లాక్ ఫంగస్ కు మందుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతున్నది. చిత్తూరుతో పాటుగా మిగతా జిల్లాల్లో […]
ఇండియాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు ప్రస్తుతం లక్షన్నరకు దిగువున నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా తగ్గుముఖం పడుతున్నది. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,34,154 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కి చేరింది. ఇందులో 2,63,90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,13,413 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2887 మంది మృతి చెందారు. […]