NTV WebDesk
Author- NTV Telugu-
వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి ఎందుకు వెళ్లకూడదు… పీసీసీ నిద్రపోతుందా?
వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అనేక మంది మాజీ మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, విజయమ్మ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని చెప్పానని, చెప్పినట్టుగానే వచ్చానని అన్నారు. ఉదయం 7గంటలకు తాను బయలుదేరి వచ్చినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియదని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి […] -
భాగ్యనగరంలో భారీ వర్షం…
భాగ్యనగరంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో వర్షం కురవడం మొదలైంది. ఆగకుండా గంట సేపు నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గంట నుంచి వర్షం కురుస్తుండటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, కూకట్ పల్లి, కేపీహెచ్పీ, అల్విన్ కాలనీ, బాలానగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఉప్పల్లో భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో […] -
దేశంలో ఎన్ని డెల్టా ప్లస్ కేసులు ఉన్నాయో తెలుసా?
దేశంలో కరోనా కేసులు ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. ఓనం పండుగ తరువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జరుపుకునే పెద్దపండగలైన వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వాటిపై కరోనా ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉన్నది. పండుగల కోసం ఒక చోట పెద్ద సంఖ్యలో గుమిగూడితే కరోనా […] -
ఆఫ్ఘన్లో రోడ్డెక్కిన మహిళలు… మాకు అవకాశం ఇవ్వండి…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాక తాలిబన్లు ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. రేపటి రోజున ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొన్ని తాత్కాలిక శాఖలు ఏర్పాటు చేసినా, రేపటి రోజున ప్రభుత్వం కొలువుదీరాక పూర్తిస్థాయి శాఖలు ఏర్పాటు చేయవచ్చు. అయితే, తాలిబన్ల పరిపాలనలో మహిళలకు రక్షణ ఉండదు. వారంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. అంతేకాదు, మహిళలకు హక్కులు ఏ మాత్రం ఉండవు. ఎవరైనా ఎదిరించి బయటకు వస్తే వారికి ఎలాంటి […] -
అలా చేయడం మంచిది కాదు… ప్రధానికి లేఖ రాస్తా…
కేంద్రం ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయడం మంచిది కాదని దీనిపై ప్రధాని మోడికీ లేఖ రాస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ విధానంపై ఆయన ఈరోజు విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ఆస్తులని, అవి దేశ భవిష్యత్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేశారని, వాటిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం వంటిది దేశప్రయోజనాలకు మంచిది కాదని […] -
9 మంది నేతలతో కాంగ్రెస్ కీలక కమిటీ… దేనికంటే…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ను చైర్మన్గా నియమించారు. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలను రూపోందించే ఈ కమిటీలో ప్రియాంక గాంధీ, ఉత్తమ్కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ లు సభ్యులుగా ఉండబోతున్నారు. దేశంలోని […] -
తెలంగాణ కరోనా అప్డేట్: కొత్తగా కేసులు ఎన్నంటే…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. ఇందులో 6,49,002 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,809 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3,878 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా […] -
ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గత రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వరకు వ్యాక్సినేషన్లను అందిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని, అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లను అందిస్తున్నామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశంలో 66 […] -
ఆఫ్ఘన్ సరిహద్దులు దాటేందుకు… ప్రజలు ఏం చేశారంటే…!!
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 30 వరకు కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. అమెరికా దళాలు లేకపోవడంతో ప్రజలంతా ఏమయ్యారు… ఎటువెళ్లారు. తిరిగి ఇళ్లకు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత ప్రజలు రూటు మార్చి ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వైపు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇరాన్ సరిహద్దులకు ప్రజలు చేరుకోవడంతో అక్కడ భద్రతను […] -
ఆ నగరంలో పుట్పాత్లపై అమ్మకం నిషేదం… ఉల్లంఘిస్తే…
నగరాల్లో చిరు వ్యాపారులు ఫుట్పాత్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకమైన వ్యాపార సముదాయాలు ఉండవు కాబట్టి వీరికి ఫుట్ పాత్లే వ్యాపార సముదాయాలుగా మారిపోతుంటాయి. నగరపాలక సంస్థలు, అధికారులు, పాలకులు వీటి గురించిపెద్దగా పట్టించుకోరు. అయితే, గత కొంత కాలంగా ఫుట్పాత్ వ్యాపారులపై నగరపాలక సంస్థలు దృష్టిసారించాయి. విశాఖ నగరపాలక సంస్థ దీనిపై ముఖ్యంగా దృష్టి సారించింది. నగరంలోని అనే ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు చేపలను విక్రయిస్తుంటారు. నగరంలో ఏ ఫుట్పాత్లపై చూసిన చేపల విక్రయాలే కనిపిస్తుంటాయి. దీంతో […]
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
-
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
-
PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!