NTV WebDesk
Author- NTV Telugu-
Jagan Cabinet Berth: జగన్ ఫ్రేమ్లో పట్టేదెవరు?
త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కేబినెట్లో కొందరు ఇళ్లకువైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే […] -
OnePlus 10 Pro: ఇండియా లాంచ్ ఎప్పుడంటే?
వన్ ప్లస్ ఫోన్ కి దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 Pro గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ సౌండ్ క్లారిటీ కలిగి ఉంటుంది. మార్చి 31న ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఆసక్తిగల అభిమానులు OnePlus 10 Pro లాంచ్ పేజీని లేదా OnePlus YouTube ఛానెల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలో అతి […] -
Tdp Protest: అసెంబ్లీ కాదు.. జగన్ భజన సభ
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే […] -
Capital Amaravati: వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేస్తారా?
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు. జగన్ గారూ.. ప్రజల […] -
Amaravati Jac: జగన్ ప్రకటనపై నిరసన
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు. మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం […] -
Funds Misuse: సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తల నిధుల స్వాహా
అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా గ్రామ పంచాయతీ నిధులు స్వాహా అవుతున్నాయి. స్వయానా సర్పంచ్, ఉప సర్పంచ్ భర్త లు కుమ్మక్కయ్యారు. వారికి ఓ ప్రజా ప్రతినిధి కూడా మద్దతు ఇవ్వడం, మరో ఉన్నతాధికారి కూడా వారికి వంతపాడడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలసి కోటిన్నర పైగా స్వాహా చేశారు. స్వంత పేర్లతో చెక్కుల ద్వారా డబ్బులు స్వాహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన […] -
Soyam Bapu Rao: కేసీఆర్ డ్రామాలు బట్టబయలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలైనయ్ అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని, పంజాబ్ లో మాదిరిగానే తెలంగాణలోనూ బియ్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మానసిక క్షోభకు […] -
Pawan Kalyan Live: నేతాజీ గ్రంథ సమీక్ష
పుస్తకాలు చదవడం అంటే నాకెంతో ఇష్టం. కోటి రూపాయలను ఇవ్వమంటే ఇస్తా. ఒక సినిమా ఫ్రీగా చేయమంటే చేసేస్తానేమో కానీ.. ఒక బుక్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేం. లైబ్రరీకి వెళితే పుస్తకాలన్నీ చదివేయాలని అత్యాశ వుంటుంది. మనం సంపాదించుకున్న నాలెడ్జ్ అలాగే మనదగ్గర వుంది. విలువలు పాటించే జర్నలిస్టులంటే నాకెంతో అభిమానం. ఎంవీఆర్ శాస్త్రి లాంటి వారు రాసిన బుక్స్ అంటే చాలా ఇష్టం. కనీసం 100 రూపాయల నోటు మీద అయిన నేతాజీ బొమ్మ ఉండాలి. […] -
Piyush Goyal Vs Prashant Reddy: హాట్ హాట్గా సాగిన వాదులాట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే […] -
YS Sharmila: కేసీఆర్ని మళ్ళీ నమ్మి మోసపోవద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు. అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ […]
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!