Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Ten Questions To Cm Kcr

Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ళపై రేవంత్ పది ప్రశ్నలు

Published Date :April 11, 2022 , 4:51 pm
By NTV WebDesk
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ళపై రేవంత్ పది ప్రశ్నలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం సేకరణ పై మెలిక పెడుతున్న విషయం నిజం కాదా? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు.మీరే లేఖ ఇచ్చి ఇప్పుడు మీరే ధర్నాలు … నిరసనలు అని డ్రామాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాన్ని గ్రహించలేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీ చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 7,500 కోట్ల నష్టం వచ్చిందని, క్రయవిక్రయాలు ప్రభుత్వం బాధ్యత ఎంత మాత్రం కాదని, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండబోవని 2021 ఫిబ్రవరిలో మీరు ప్రకటన చేసింది వాస్తవం కాదా? ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకునే కుతంత్రానికి మీరు ఆ నాడే బీజం వేశారనడానికి ఇది నిదర్శనం కాదా?

యాసంగి సీజన్ సన్నాహాలపై ఫిబ్రవరి 25, మార్చి 8న కేంద్ర ఆహార శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ సారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు అని మీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా? FCI యాసంగి ప్రణాళికలో తెలంగాణకు చోటు దక్కకపోవడానికి ఇది కారణం కాదా?

యాసంగి ధాన్యం సేకరణ సన్నాహకాలు సహజంగా మార్చి మొదటి వారంలోనే ప్రారంభించాలి కదా! నిజంగా ధాన్యం కొనుగోలు పై మీకు చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోనె సంచులకు టెండర్లు, రైస్ మిల్లర్లకు కోటా కేటాయింపు, ట్రాన్స్ పోర్టేషన్ టెండర్లు తదితర ప్రక్రియను ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లేమ్ గేమ్ తో ఇప్పటికే రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? కనీస మద్ధతు ధర రూ.1960 ఉండగా… మీరు చేతులెత్తేయడంతో రైతులు నిస్సహాయ స్థితిలో రైస్ మిల్లర్ల కు రూ.1200 -1400 లకే ధాన్యం తెగనమ్ముకుంటున్న మాట వాస్తవం కాదా? దీని వల్ల తెలంగాణ రైతాంగానికి సుమారు రూ.3000 కోట్ల మేర నష్టం వస్తుందన్న విషయం మీకు తెలియదా?

రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రైతుల కష్టాన్ని అగ్గువకే దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల మాఫియాతో మీ కుటుంబ సభ్యులే ఒప్పందాలు చేసుకుని రైతులను నిండా ముంచుతున్నారన్న ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి?

డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ లో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉంది. అంటే… ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని ఎఫ్ సీఐకి సరఫరా చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీ బాధ్యతను నెరవేర్చకుండా ఢిల్లీలో అతి కొద్ది గంటల నిరసన దీక్షల పేరుతో, అది పార్లమెంట్ సమావేశాలు ముగిసి ఎక్కడి వారు అక్కడకు వెళ్లిపోయాక డ్రామాలు చేయడం మీకు రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప… రైతు ధాన్యం కొనుగోలుకు పరిష్కారం ఎలా దొరుకుతుంది?

మీ దిక్కుమాలిన ఈగోలతో రైతులనే కాదు… రాష్ట్రంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది వాస్తవం కాదా? సివిల్ సప్లై కార్పొరేషన్ సేకరించిన ధాన్యానికి ఎఫ్ సీఐ 2.5 శాతం కమీషన్ చెల్లిస్తోంది. గత ఏడాది యాసంగి సీజన్ లో సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.17,914 కోట్ల విలువైన 92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా దానికి కమీషన్ గా రూ.447 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు ఖర్చులన్నీ ఈ ఆదాయం నుంచే చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా ఇవ్వడం లేదు. ఇప్పుడు ధాన్యం సేకరణ లేకపోతే కార్పొరేషన్ మనుగడే ప్రశ్నార్థకం కాదా?

క్వింటాల్ ధాన్యానికి సాధారణంగా FCIకి 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం నూకలను ఎప్సీఐ ఆమోదిస్తోంది. అంటే, రైస్ మిల్లర్లు 51 కిలోల హెడ్ రైస్, 16 కిలోల నూకలతో కలిపి 67 కిలోలు సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి డెలివరీ ఇస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్ చేయకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 కిలోలకు బదులు 34 కిలోల నూక వస్తుంది. అంటే, ఎఫ్సీఐ ఆమోదించిన దానికంటే 18 కిలోలు అదనంగా వస్తుందన్న మాట. బియ్యంతో పోల్చితే నూకలకు సగం ధర మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐకి 67 కిలోలకు బదులు 58 కిలోలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా తొమ్మిది కిలోల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీని విలువ తిప్పి కొట్టినా రూ.1500 కోట్లకు మించి కాదు. ప్రపంచ మేథావిగా మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కదా! ఈ మాత్రం లాజిక్ మీకు ఎందుకు అర్థం కావడం లేదు? రైతుల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేదా? పైగా వాళ్లను మిల్లర్ల చేతుల్లో పెట్టి రూ.3000 కోట్లు నష్టపోయేలా చేయడం మీ పాలనా దక్షతకు నిదర్శనంగా భావించాలా?

యాసంగి సీజన్ లో కూడా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందకే వస్తుంది. మొదట్లో ఉష్ణోగ్రతలు అంతగా పెరగవు కనుక ఇది బాయిల్డ్ రైస్ కాదు. ఇలా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం సుమారు 10 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఇలా రా రైస్ గా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి మీరు ఏర్పాట్లు చేయలేదంటే… రైతులను నిండా ముంచాలన్న దురుద్ధేశం తప్ప… ఇంకేం అనుకోవాలి?అంటూ రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Deeksha
  • Farmers
  • paddy issue
  • revanth-reddy
  • telangana

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

  • Kollywood : ఆ దర్శకుడు చేసినవీ రెండే సినిమాలు కానీ యూత్‌లో ఫుల్ క్రేజ్

  • China-Iran: యుద్ధంలోకి చైనా! ఇరాన్‌కు డ్రాగన్ మద్దతు

ట్రెండింగ్‌

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions