NTV WebDesk
Author- NTV Telugu-
KCR: శ్రీలంక విషయంలో మాట్లాడకపోతే.. దోషిగా పరిగణిస్తాం
మోడీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని, బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నేడు (శనివారం) జలవిహార్లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన సభను నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. మీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని ఆగ్రమం వ్యక్తం చేశారు. మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని మండిపడ్డారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.పెద్ద కంపెనీలన్నీ దేశం నుంచి వెళ్లిపోయాయని విమర్శించారు. […] -
BJP National Executive Meeting: ఊర్లనే ఉంటవా? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా? బండి ట్వీట్
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నా విషయం తెలిసిందే.. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభలోను ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంతో రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు.. ఆయకు బదులుగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీనిపై తలసాని తనే వెళ్లనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే […] -
V. Hanumantha Rao: రేవంత్ కు బిగ్ షాక్.. సిన్హా స్వాగతంలో వీహెచ్
నేడు విపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పటు పలువురు టీఆర్ఎస్ నేతలు స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. కాగా.. టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హన్మంతరావు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పిలిపించిన వారితో మేము […] -
Prakash Raj: ఆసక్తి రేపుతున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. డియర్ సుప్రీం లీడర్ అంటూ..
సినీ నటుడు రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై సెటైర్లు వేశారు. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన విమర్శించారు. ప్రధాని పేరు ప్రస్తావించకుండా డియర్ సుప్రీం లీడర్, హైదరాబాద్ కు స్వాగతం అంటూ ట్వీట్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందని ప్రకాశ్ రాజ్ కితాబిచ్చారు. అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ పర్యటనల సందర్భంగా రోడ్లు వేయడానికి ప్రజలు […] -
BJP National Executive Meeting: రేపు పరేడ్ గ్రౌండ్ లో మోదీ సభ.. ట్రాఫిక్ మళ్లింపు
రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగునున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వారు మాట్లాడుతూ.. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నిషేధించారు. టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని […] -
Breaking: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్.. టీఆర్ఎస్ భారీ ర్యాలీ
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ .. టీఆర్ఎస్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుండి బైక్ ర్యాలీ మొదలైంది. బైక్ ర్యాలీలో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్, కేటీఆర్ పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు దాదాపు ఐదు వేల మంది భారీ బైక్ ర్యాలీగా బయలు దేరారు. అయితే ఈ […] -
BJP National Executive Meeting: కేంద్రమంత్రికి చేదు అనుభవం.. గెస్ట్ హౌస్ కు తాళం
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు. మెదక్ జిల్లాలో శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్హౌజ్కు వచ్చినప్పటీకీ ఆర్అండ్బీ అధికారులు తాళం తీయని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం […] -
BJP National Executive Meeting: కావాలనే రెచ్చగొడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్
నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. […] -
BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక […] -
Vips Visit in Hyderabad: రాష్ట్రానికి వీఐపీలు.. షెడ్యూల్..
వరుసగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ.. ఈ ఏడాది జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజుల పాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు జాతీయ నాయకులు అందరూ హాజరు కానున్నారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు అందరూ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి తరఫున పోటీలో నిలిచిన […]
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?