PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ రోజు (ఆదివారం) ఒక అపురూపమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి ఇంటికి తరలివచ్చారు. అసలు ఏం జరిగిందంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పరామర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్ను గతంలోనే ‘ఆంధీ’ (సుడిగాలి) అని అభివర్ణించిన మోడీ, ఇప్పుడు స్వయంగా ఆయన ఇంటికి రావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.@PawanKalyan pic.twitter.com/FfIbr1bPDi
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
— Narendra Modi (@narendramodi) May 10, 2026
20 నిమిషాల పాటు ఆత్మీయ భేటీ
ప్రధాని మోడీ పవన్ నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో ఒక పిక్ మాత్రం ‘పిక్ ఆఫ్ ది డే’గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ప్రధానితో గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా నందన్, ఆద్య, పోలేనా అంజనాలతో పాటు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారి మార్క్ శంకర్ భుజంపై ప్రధాని మోడీ చేయి వేసి నవ్వుతూ ఫోటోకు పోజు ఇవ్వడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యావాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘నా నివాసానికి వచ్చి పరామర్శించడం గొప్ప అనుభూతి కలిగించింది. నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు విచ్చేయడం.. ఆయనలోని ఆప్యాయత, అనురాగం మనవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని మోడీ చూపిన ఆదరణను ఎప్పటికీ గుర్తంచుకుంటాను’ అని రాసుకొచ్చారు.
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life. https://t.co/gNEmsW4I0F
— Pawan Kalyan (@PawanKalyan) May 10, 2026
తాజావార్తలు
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..