-
భూపాలపల్లి నుంచి బొగ్గు రవాణా నిలిపివేత…
భూపాలపల్లి నుంచి బొగ్గు రవాణా నిలిపివేశారు. భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తాడిచర్ల నుంచి బొగ్గు ఇతర రాష్ట్రాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలు రాష్ట్ర సింగరేణి అధికారులకు మౌఖికంగా ఆదేశించారని వినోద్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని […] -
హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగరు : హరీష్ రావు
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్ […] -
‘విజయగర్జన’తో ప్రజల్లోకి వెళ్లనున్న టీఆర్ఎస్?
టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆపార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 15న వరంగల్ శివారులో ‘విజయగర్జన’ పేరుతో టీఆర్ఎస్ భారీసభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నహాక సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ […] -
ఐపీఎల్ 2022 పై గంగూలీ కీలక వ్యాఖ్యలు…
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని […] -
ఆది సాయికుమార్ హీరోగా మొదలైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో దసరా రోజున జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తు అజయ్ శ్రీనివాస్ దీనిని నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సీనియర్ నిర్మాతలు కె. యస్. రామారావు , సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్, పుస్కర రామ్మోహన రావు ఈ […] -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫస్ట్ లుక్ విడుదల
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మహా సముద్రం’ చిత్రం దసరా కానుకగా ఈనెల 14న విడుదలైంది. ఇక 15వ తేదీ శర్వానంద్ కొత్త సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కు సంబంధించిన పోస్టర్ ను దర్శక నిర్మాతలు కిశోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి విడుదల చేశారు. హీరో శర్వానంద్ ఏ ఒక్క జానర్ కో పరిమితం అయిపోకుండా, డిఫరెంట్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుంటున్నాడు. అలా ప్రస్తుతం ఈ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ […] -
గుండెపోటుతో భారత యువ క్రికెటర్ మృతి…
భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బరోట్ ఈరోజు గుండె పోటుతో మరణించాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. అవి బరోట్ మరణ వార్తను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అయితే 29 ఏళ్ల అవి బరోట్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా మాట్లాడుతూ… అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోపలే తుది శ్వాస […] -
హుజూరాబాద్ లో కమ్యూనిస్టుల దారి ఎటువైపు?
తెలంగాణలోని హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీలని చెప్పుకునే సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పార్టీల దుస్థితి చూస్తుంటే తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్ ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. […] -
నా రాజీనామా వల్లనే వస్తున్నాయి.. అందుకు నాకే ఓటు వేయండి
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఎక్కడి వాడో వచ్చి మన ఊర్లలో మన బొడ్రాయి దగ్గర ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అభివృద్ధి చెయ్యలేదు అని అంటున్నారు. బ్రోకర్ గాళ్ళు, పని చేయని వారు వచ్చి మాట్లాడుతుంటే మీరు కూడా విని ఊరుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్నారు. ఈ ఊరికి రోడ్డు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే వేయించిన. చిన్న ఊరి వారికి కూడా పెద్ద బ్రిడ్జి […] -
చిన్నమ్మ రీ-ఎంట్రీతో తమిళనాట కొత్త రాజకీయం..!
రేపటికి, అంటే అక్టోబర్ 17కి ఆలిండియా అన్నా డీఎంకే- AIADMK ఆవిర్భవించి 50 ఏళ్లవుతుంది. దానికి ఒక రోజు ముందు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరున్న జయలలిత, ఎంజీఆర్ సమాధులపై పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే, జయ సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టటం అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే ఆమె అక్కడకు వచ్చిన కారుపై అన్నాడీఎంకే జెండా […]
తాజావార్తలు
-
Hardik Pandya: టైమ్అవుట్ సమయంలో తల తిరిగింది.. హార్దిక్ పాండ్య సంచలన వ్యాఖ్యలు!
-
Stock Market: శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
-
AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
-
NBK111: బాలకృష్ణ సరసన నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్..
-
SRH vs DC Playing XI: ఇరుజట్లకూ గాయాల టెన్షన్.. కమిన్స్, అక్షర్ పటేల్ ఆడతారా.?
ట్రెండింగ్
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!