వర్షాకాలం ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం కాబట్టి ఎక్కువ నీరు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎలక్ర్టిక్ కార్లతో జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కువగా నీళ్లు నిలిచిన రోడ్లపై నుంచి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు.
ఇండియాకు మరో టెక్ కంపెనీ రాబోతోంది. చైనాలో ఉన్న తైవాన్కు చెందిన సెమీకండక్టర్కు చెందిన టెక్ కంపెనీని ఇండియాకు తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, తైవాన్ల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే చైనాలో కొనసాగుతున్న కంపెనీలను తైవాన్ ఇతర దేశాలకు తరలించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మనం ఏమీ చూడాలన్నా కళ్లు ప్రధానం. కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకో గలుగుతాము. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు కంటి సమస్యలు ఉంటున్నాయి.
ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అది కూడా నిండా నలబై ఏళ్లు నిండని వారు కూడా హార్ట్ ఎటాక్తో మరణిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితం మరణించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ 39 ఏళ్లకే హార్ట్ ఎటాక్తో మరణించాడు.
టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలను పెంచాలని కంపెనీ నిర్ణయించింది. పెరిగిన ధరలు ఈ నెల 17 నుంచి అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో సోమవారం రాత్రి ఒక షోరూమ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. సిప్రీ బజార్ ప్రాంతంలోని మూడంతస్తుల రెండు ఎలక్ట్రానిక్ షోరూమ్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ఒడిషాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ మారుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా దిగిపోయి.. ఆయన స్థానంలో అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ప్రచారం ముగించుకొని తిరిగి ఇంటి వస్తుండగా హత్యకు గురైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ నేడు పరామర్శించనున్నారు.
రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆడిట్రిపోర్ట్ లను భారత ఎన్నికల కమిషన్కు ఆన్లైన్లో సమర్పించవచ్చు. నేరుగా ఈసీఐ వెళ్లి సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.