చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జునలను స్థానికులు అడ్డుకున్నారు. దొమ్మేరు దళిత యువకుడు బొంత మహేంద్ర మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
డ్రీమ్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని ఫ్యాన్కోడ్ను భాగస్వామ్యం చేసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్ని ప్రారంభించింది. ఇది క్రికెట్, ఫుట్బాల్తో సహా ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. అమెజాన్ ఇంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన భారత క్రికెట్ మ్యాచ్లతో సహా ప్రత్యక్ష ప్రసార మ్యాచ్లను ప్రసారం చేసింది.
ప్రపంచకప్ 2023 ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్కు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
గృహ నిర్మాణ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.